యాప్నగరం

మా ఆయన నొచ్చుకున్నా ఫర్వాలేదు: దినేశ్ కార్తీక్ భార్య

మా ఆయన నొచ్చుకున్నా ఫర్వాలేదు గానీ... మనదేశంలో క్రికెట్ వల్లే ఇతర క్రీడలకు ఆదరణ లభించడం లేదు. ఈ పరిస్థితి మారాలని దీపికా పల్లికల్ కోరుకుంటోంది.

TNN 4 Apr 2018, 2:16 pm
దినేశ్ కార్తీక్ భార్య దీపికా పల్లికల్ క్రికెట్‌కు వ్యతిరేకంగా కామెంట్లు చేసింది. స్వాష్ ప్లేయర్ అయిన దీపికా పల్లికల్‌కు క్రికెట్ అంటే అస్సలు నచ్చదు. క్రికెట్ కారణంగానే దేశంలో ఇతర క్రీడలు ఆదరణ పొందడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. క్రికెట్ అంటే పడి చచ్చేంత పిచ్చి ఉన్న మనదేశంలో స్క్వాష్‌కు ఆదరణ అంతంత మాత్రమే. అయితే కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధిస్తే.. క్రికెట్‌కు మించి ఆదరణను స్క్వాష్ పొందుతుందనే ఆశాభావాన్ని దీపిక వ్యక్తం చేసింది. మా ఆయన నొచ్చుకున్నా ఫర్వాలేదు కానీ.. ఆదరణలో ఇతర క్రీడలు క్రికెట్‌ను వెనక్కి నెట్టాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
Samayam Telugu dinesh karthik and dipika pallikal


కార్తీక్, నేను ఇద్దరం అథ్లెట్లమే. తనతో సమానంగా నాకు కూడా గుర్తింపు దక్కాలి. కానీ క్రికెటర్లకే ఎక్కువ గుర్తింపు లభిస్తోందని దీపిక తెలిపింది. 2015లో దినేశ్ కార్తీక్‌ను పెళ్లాడిన ఈ స్క్వాష్ ప్లేయర్.. తన భర్త ఆడే క్రికెట్మ్యాచ్‌లను కూడా చూడనని చెప్పింది. తాను క్రికెటర్ భార్య కావడం వల్లే మీడియా తనను గుర్తిస్తోందని చెప్పుకొచ్చింది.

నాలుగేళ్ల క్రితం గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో దీపిక తన భాగస్వామి జోష్న చినప్పతో కలిసి డబుల్స్‌లో స్వర్ణం సాధించింది. స్క్వాష్‌లో భారత్ సాధించిన తొలి పతకం ఇదే కావడం విశేషం. బుధవారం ప్రారంభమైన కామన్వెల్త్ క్రీడల్లోనూ పతకం తేవడం కోసం శక్తి మేర ప్రయత్నిస్తానని దీపికా పల్లికల్ చెప్పింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.