యాప్నగరం

సెమీస్‌లో ఓడిన దీపికా పల్లికల్.. కాంస్యంతో సరి

మహిళల సింగిల్స్ స్క్వాష్ సెమీఫైనల్లో మలేసియాకు చెందిన నికోల్ డేవిడ్ చేతిలో 0-3 (7-11, 9-11, 6-11) తేడాతో ఓడిన దీపికా.. కాంస్యంతో సరిపెట్టుకుంది.

Samayam Telugu 25 Aug 2018, 2:46 pm
ఏషియన్ గేమ్స్ ఏడో రోజున భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ కాంస్యం గెలుపొందింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో మలేసియాకు చెందిన నికోల్ డేవిడ్ చేతిలో 0-3 (7-11, 9-11, 6-11) తేడాతో ఓడిన దీపికా.. కాంస్యంతో సరిపెట్టుకుంది. ఆసియా క్రీడల్లో ఆమెకు ఇది రెండో పతకం కావడం గమనార్హం. 2014లో ఇంచియాన్‌లో జరిగిన మహిళల సింగిల్స్‌లోనూ దీపికా కాంస్య పతకం సాధించింది. దీపిక గెలుపొందిన పతకంతో భారత్ ఖాతాలో 26 పతకాలు చేరాయి. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 9వ స్థానంలో నిలిచింది.
Samayam Telugu dipika


బ్యాడ్మింటన్ విషయానికి వస్తే.. సింధు, సైనా క్వార్టర్ ఫైనల్ చేరారు. ఇండోనేసియాకు చెందిన పిత్రియానిని 21-6, 21-14 తేడాతో సైనా ఓడించింది. ఆ దేశానికే చెందిన గ్రెగోరియా మరిస్కా తంజుంగ్‌‌పై 21-12, 21-15 తేడాతో సింధు గెలుపొందింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.