యాప్నగరం

అమరావతిలో ముగిసిన F1H20 రేస్

భారీ అంచనాల మధ్య నిన్న ఫైనల్‌కి అర్హత సాధించిన టీమ్ అమరావతి రైడర్ ఎరిక్ ఎడెన్ ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

Samayam Telugu 18 Nov 2018, 6:10 pm
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన F1H20 పవర్ బోటింగ్ రేసు ఆదివారం ముగిసింది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో జరిగిన ఈ రేస్‌ వీక్షకుల్ని మునివేళ్లపై నిలబెట్టగా.. అబుదాబి టీమ్ డ్రైవర్ టోరెంట్ షాన్ విజేతగా నిలిచాడు. రెండో స్థానంలో ఎమిరేట్స్ టీమ్ మహిళా డ్రైవర్ మారిట్ స్ట్రోమోయ్, మూడో స్థానంలో అబుదాబి డ్రైవర్ ఎరిక్ స్టార్క్ నిలిచారు.
Samayam Telugu Telugu-image


భారీ అంచనాల మధ్య నిన్న ఫైనల్‌కి అర్హత సాధించిన టీమ్ అమరావతి రైడర్ ఎరిక్ ఎడెన్ ఆరో స్థానంతో సరిపెట్టుకోగా.. 32వ ల్యాప్‌ వద్ద బోట్ క్రాష్ అవడంతో టీమ్ అమరావతి రెండో డ్రైవర్ జోనస్ అండర్సన్ 11వ స్థానంతో నిరాశపరిచాడు.

ఆస్ట్రేలియా, చైనా, ఫిన్‌లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, భారత్‌, పోలాండ్‌, పోర్చుగల్‌, స్వీడన్‌, థాయ్‌లాండ్‌, యూఏఈ, యూఎస్‌ఏ, నార్వే తదితర దేశాలు ఈ పోటీల్లో ప్రాతినిథ్యం వహించగా మొత్తం 19 మంది బోట్ డ్రైవర్లు పాల్గొన్నారు.

ఈ పోటీలను తిలకించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియ విజేతలకి ట్రోఫీలను అందజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.