యాప్నగరం

ఫిఫా ప్రపంచకప్.. టికెట్ల కోసం బారులు

ఫిఫా అండర్-17 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ టికెట్ల కోసం కోల్‌కతాలో అభిమానులు బారులు తీరారు. షెడ్యూల్ ప్రకారం

TNN 24 Oct 2017, 3:25 pm
ఫిఫా అండర్-17 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ టికెట్ల కోసం కోల్‌కతాలో అభిమానులు బారులు తీరారు. షెడ్యూల్ ప్రకారం గువాహటిలో ఈ మ్యాచ్ బుధవారం జరగాల్సి ఉంది. కానీ.. గత కొద్దిరోజులుగా అక్కడ వర్షాలు కురుస్తుండటంతో మ్యాచ్ జరగాల్సిన ఇందిరాగాంధీ మైదానం చిత్తడిగా మారింది. దీంతో టోర్నీ నిర్వాహకులు మ్యాచ్‌ని కోల్‌కతాలోని సాల్ట్‌ లేక్ స్టేడియానికి మార్చారు.
Samayam Telugu fifa u 17 world cup semi final venue shifted from guwahati to kolkata
ఫిఫా ప్రపంచకప్.. టికెట్ల కోసం బారులు


టోర్నీలో సంచలన విజయాలతో దూసుకెళ్తున్న బ్రెజిల్‌ జట్టుతో సెమీస్‌లో ఇంగ్లాండ్ ఢీకొంటుండటంతో అభిమానులు పెద్ద సంఖ్యలో ఆసక్తి కనబరుస్తున్నారు. కోల్‌కతా నగరంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఎండ వేడిమిని సైతం లెక్క చేయకుండా బారులు తీరి టికెట్లని కొనుగోలు చేస్తున్నారు.


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.