యాప్నగరం

Green India Challengeని స్వీకరించిన చాముండేశ్వరనాథ్

తెలంగాణలో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వేగంగా విస్తరిస్తోంది. ఈ ఛాలెంజ్‌ని స్వీకరించిన వారు.. మొక్కలు నాటి.. మరో ముగ్గురుకి ఈ ఛాలెంజ్‌ని విసరాల్సి ఉంటుంది. ఇప్పటికే యాంకర్ సుమ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఎంపీ, ఎమ్మెల్యేలు భాగస్వాములయ్యారు.

Samayam Telugu 11 Jan 2020, 12:00 pm
తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని మాజీ క్రికెటర్, తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరనాథ్‌ తాజాగా స్వీకరించారు. గచ్చిబౌలి‌లోని తన ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటిన చాముండేశ్వరనాథ్.. ఈ ఛాలెంజ్‌ విస్తరణకి ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురాం కృష్ణంరాజు ఇటీవల ఈ గ్రీన్ ఛాలెంజ్‌ని చాముండేశ్వరనాథ్‌కి విసిరిన విషయం తెలిసిందే.
Samayam Telugu Chamundeswaranath,   Green India Challenge.


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారాన్ని ప్రారంభించగా.. అందులో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని తెరపైకి తీసుకొచ్చారు. ఛాలెంజ్‌ని స్వీకరించిన వారు.. మొక్కలు నాటి.. మరో ముగ్గురుకి ఈ ఛాలెంజ్‌ని విసరాలి. గత ఏడాది నుంచి ఈ కార్యక్రమంలో చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు భాగస్వాములయ్యారు.


చాముండేశ్వరనాథ్ తాజాగా మొక్కలు నాటి.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, పీవీ సింధు తల్లి విజయ, హీరో నాగచైతన్యకి విసిరారు. చాముండేశ్వరనాథ్ మొక్కలు నాటే సమయంలో ఆయన వెంట గ్రీన్ ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులు సుబ్బరాజు, వినయ్ ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.