యాప్నగరం

హాకీకి గుడ్‌బై చెప్పిన సర్దార్ సింగ్..!

2006లో హాకీ టీమ్ కెప్టెన్‌గా ఎంపికైన సర్దార్ సింగ్ దాదాపు పదేళ్ల పాటు జట్టుని అదే హోదాలో నడిపించాడు. మొత్తంగా కెరీర్‌లో 300 మ్యాచ్‌లు ఆడిన సర్దార్ సింగ్‌కి 2015లో పద్మశ్రీ పురస్కారం లభించింది.

Samayam Telugu 12 Sep 2018, 7:41 pm
భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ బుధవారం ఆకస్మిక నిర్ణయం తీసుకున్నాడు. సుదీర్ఘకాలంగా హాకీలో అద్భుత ప్రదర్శనతో భారత్‌ని మురిపిస్తూ వచ్చిన సర్దార్ సింగ్.. ఆటకి వీడ్కోలు పలుకుతున్నట్లు ఈరోజు ప్రకటించాడు. ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్ తర్వాత మళ్లీ జట్టులోకి పునరాగమనం చేసిన సర్దార్ సింగ్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా గేమ్స్ 2018లో సత్తాచాటగా.. భారత్ జట్టు రెండు టోర్నీల్లోనూ కాంస్య పతకాలను గెలుపొందింది.
Samayam Telugu Bengaluru: Indian Hockey player Sardar Singh during a practice session ahead of...
Indian Hockey player Sardar Singh during a practice session ahead of Asian Games 2018, in Bengaluru on Friday, Aug 3, 2018.Photo/Shailendra Bhojak)


‘అంతర్జాతీయ హాకీ‌కి రిటైర్మెంట్ ప్రకటించాలని నేను నిర్ణయం తీసుకున్నా. 12 ఏళ్ల పాటు భారత్ తరఫున హాకీ ఆడాను. ఇది చాలా సుదీర్ఘకాలం. అందుకే.. భవిష్యత్‌ తరాల వారికి కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వైదొలుగుతున్నా. నా కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు హాకీ ఇండియాతో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం చెప్తున్నా. రిటైర్మెంట్‌కి ఇదే తగిన సమయమని నా భావన. అంతేతప్ప ఫిట్‌నెస్ లేకపోవడం అనేది కారణం కాదు. మరికొనేళ్లపాటు హాకీ ఆడే ఫిట్‌నెస్ నాకు ఉంది’ అని సర్దార్ సింగ్ వెల్లడించాడు.

2006లో హాకీ టీమ్ కెప్టెన్‌గా ఎంపికైన సర్దార్ సింగ్ దాదాపు పదేళ్ల పాటు జట్టుని అదే హోదాలో నడిపించాడు. మొత్తంగా కెరీర్‌లో 300 మ్యాచ్‌లు ఆడిన సర్దార్ సింగ్‌కి 2015లో పద్మశ్రీ పురస్కారం లభించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.