యాప్నగరం

హకీ: న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి

నాలుగు దేశాల హాకీ టోర్నమెంటులో భాగంగా శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 2-3 తేడాతో ఓటమి పాలైంది.

TNN 26 Nov 2016, 3:01 pm
నాలుగు దేశాల హాకీ టోర్నమెంటులో భాగంగా శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 2-3 తేడాతో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోన్న ఈ టోర్నీలో మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడిన భారత్ ఒక్కటి మాత్రమే నెగ్గింది. దీంతో ఫైనల్ అవకాశాన్ని కోల్పోయింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరాయి. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అలాగే భారత్, మలేసియా జట్ల మధ్య మూడు, నాలుగు స్థానాల కోసం ఆదివారం మ్యాచ్ జరగనుంది.
Samayam Telugu four nations hockey tournament india lose 2 3 to new zealand
హకీ: న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి


కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో మొదట దూకుడుగా ఆడిన భారత్ చివరికి మ్యాచ్ చేజార్చుకుంది. ఆఖరి 15 నిమిషాల్లో కివీస్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడి భారత్ చేతులో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ఆట ప్రారంభంలో భారత్‌కు వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకుంది. రూపిందర్ పాల్ సింగ్ అద్భుతమైన గోల్‌తో భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆట 47వ నిమిషంలో న్యూజిలాండ్ ఆటగాడు నిక్ రాస్ స్కోరును సమం చేశాడు. ఆ తరవాత స్వల్ప వ్యవధిలోనే న్యూజిలాండ్ వరసగా రెండు గోల్స్ చేసి 3-1 ఆధిక్యం సాధించింది.

మరికొద్ద సేపట్లో మ్యాచ్ ముగుస్తుందనగా భారత ఆటగాడు రూపిందర్ సింగ్ మరో గోల్ చేసి కివీస్ ఆధిక్యాన్ని 3-2కి తగ్గించగలిగాడు. కాగా, మ్యాచ్ ఆఖరి 15 నిమిషాల్లో భారత ఆటగాళ్ల అలసత్వం తేటతెల్లమైంది. కివీస్ మూడు గోల్స్‌ను ఆఖరి 15 నిమిషాల్లో చేయడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.