యాప్నగరం

సాక్షి మాలిక్‌కి ఆరోజే రూ.2.5 కోట్ల చెక్ ఇచ్చేశాం- హర్యానా మంత్రి

తాను రియో ఒలంపిక్స్‌లో కాంస్య పతకం గెలిచాకా తనకి ఇస్తానన్న రూ.2.5 కోట్ల నగదు బహుమతి, ఉద్యోగం ఇవ్వకుండా...

TNN 5 Mar 2017, 1:03 pm
తాను రియో ఒలంపిక్స్‌లో కాంస్య పతకం గెలిచాకా తనకి ఇస్తానన్న రూ.2.5 కోట్ల నగదు బహుమతి, ఉద్యోగం ఇవ్వకుండా హర్యానా ప్రభుత్వం మాట తప్పిందని ప్రముఖ రెజ్లర్ సాక్షి మాలిక్ చేసిన వ్యాఖ్యలపై హర్యానా ప్రభుత్వం స్పందించింది. "ఆమె ఏరోజైతే రియో ఒలంపిక్స్ నుంచి తిరుగుపయనమై ఇండియాలో కాలుపెట్టిందో, ఆ రోజే ఆమెకి ఆ రూ.2.5 కోట్ల చెక్ అందజేయడం జరిగింది" అని అన్నారు ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అనిల్ విజ్. మా రాజకీయాల్లోకన్నా క్రీడల్లో రాజకీయాలు ఇంకా ఎక్కువగా వున్నాయని వ్యాఖ్యానించిన మంత్రిగారు... సాక్షి మాలిక్ అలా ఎందుకు ఆరోపించాల్సి వచ్చిందో ఆమెకే తెలియాలి అని అన్నారు.
Samayam Telugu haryana sports minister anil vij refuted sakshi maliks allegations
సాక్షి మాలిక్‌కి ఆరోజే రూ.2.5 కోట్ల చెక్ ఇచ్చేశాం- హర్యానా మంత్రి


సాక్షి మాలిక్ అడిగిన విధంగానే మహర్షి దయానంద్ యూనివర్శిటీలో డైరెక్టర్ పోస్ట్ లేకున్నా అది క్రియేట్ చేసి ఆ పోస్ట్ ఆమెకి ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ యూనివర్శిటీకి హర్యానా ప్రభుత్వం ఓ లేఖ కూడా రాసింది. నియమనిబంధనల ప్రకారం దానికి కొంత టైమ్ పడుతుంది. అలాగే ఆమె అడిగిన క్రీడా స్థలం నిర్మాణం కోసం రూ.80 లక్షలు మంజూరు చేయడానికి కూడా హర్యానా సర్కార్ అంగీకరించింది. అందుకోసం టెండర్లు ఆహ్వానించి పని ప్రారంభించాల్సి వుంటుంది. కానీ ఇంతలోనే ఇలా ఆరోపించాల్సిన అవసరం ఏముందో అర్థం కావడం లేదని వాపోయారు అనిల్ విజ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.