యాప్నగరం

పాక్‌ని మళ్లీ ఓడించిన భారత్ హాకీ జట్టు

మ్యాచ్ 8వ నిమిషంలోనే రమన్‌దీప్ సింగ్ గోల్ చేసి భారత్‌ ఖాతా తెరవగా.. 25వ నిమిషంలో తల్విందర్, 27వ నిమిషంలో

TNN 24 Jun 2017, 8:15 pm
లండన్‌లో జరుగుతున్న హాకీ ప్రపంచ లీగ్‌లో ఇప్పటికే టైటిల్ రేసు నుంచి నిష్రమించిన భారత్ టోర్నీలో వరుసగా రెండోసారి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ని మట్టికరిపించింది. క్వార్టర్స్‌లో మలేసియా చేతిలో అనూహ్యంగా ఓడిన భారత్ వర్గీకరణ పోరులో భాగంగా శనివారం పాకిస్థాన్‌ని ఢీకొట్టింది. టోర్నీలో 5,8వ స్థానాల కోసం ఈ పోరు జరగగా.. భారత్ 6-1 తేడాతో పాక్‌ని చిత్తుగా ఓడించేసింది. లీగ్ దశలో భాగంగా గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లోనూ పాకిస్థాన్‌ను 7-1తేడాతో భారత్ ఓడించిన విషయం తెలిసిందే.
Samayam Telugu hockey world league semi final india humble pakistan 6 1
పాక్‌ని మళ్లీ ఓడించిన భారత్ హాకీ జట్టు


మ్యాచ్ 8వ నిమిషంలోనే రమన్‌దీప్ సింగ్ గోల్ చేసి భారత్‌ ఖాతా తెరవగా.. 25వ నిమిషంలో తల్విందర్, 27వ నిమిషంలో మన్‌దీప్ సింగ్ గోల్స్ చేయడంతో పాక్ ఆత్మరక్షణలో పడిపోయింది. ఈ దశలోనే మళ్లీ రమన్‌దీప్ సింగ్ గోల్ చేయడంతో సగం ఆట ముగిసే సమయానికి భారత్ 4-0తో ఆధిక్యంలో నిలిచింది. చివర్లో కూడా హర్మన్‌ప్రీత్ సింగ్, మన్‌దీప్ సింగ్ చెరో గోల్ చేశారు. ఇప్పటికే టోర్నీలో మెరుగైన ఆట ప్రదర్శించిన భారత్‌కి వచ్చే ఏడాదిలో భువనేశ్వర్‌లో జరగనున్న హాకీ ప్రపంచకప్‌కి బెర్తు ఖాయమవగా.. పాక్ బెర్తు ప్రమాదంలో పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.