యాప్నగరం

హాంకాంగ్ ఓపెన్ ప్రీక్వార్టర్స్‌లోనే సింధు ఔట్

హాంకాంగ్ ఓపెన్‌లో 19వ సీడ్‌ బుసావన్‌తో పోటీపడిన ఆరో సీడ్ పీవీ సింధు.. కేవలం 36 నిమిషాల్లోనే మ్యాచ్‌ని చేజార్చుకుంది. వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత ఆడిన అన్ని టోర్నీల్లోనూ సింధు ఓడిపోవడం గమనార్హం.

Samayam Telugu 15 Nov 2019, 9:18 am
హాంకాంగ్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకి నిరాశ ఎదురైంది. ఈ ఏడాది వరల్డ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత వరుసగా ఆడిన అన్ని టోర్నీల్లోనూ పరాజయాన్ని చవిచూస్తున్న పీవీ సింధు.. హాంకాంగ్ ఓపెన్‌లోనూ ప్రీక్వార్టర్స్‌లోనే ఓడి ఇంటిబాట పట్టింది.
Samayam Telugu Jakarta: P.V. Sindhu of India competes against Akane Yamaguchi of Japan during t...
P.V. Sindhu


Read More: undefined

మహిళల సింగిల్స్‌లో భాగంగా థాయ్‌లాండ్‌కి చెందిన బుసావన్‌తో ప్రీక్వార్టర్స్‌లో పోటీపడిన పీవీ సింధు 18-21, 21-11, 16-21 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఆరో సీడ్‌గా ఉన్న సింధు మ్యాచ్ ముందు వరకూ బుసావన్‌పై 10-0 గెలుపు రికార్డ్‌తో ఉంది. దీంతో.. అలవోకగా విజయం సాధిస్తుందని అందరూ ఊహించనగా.. అనూహ్యంగా సింధు ఓడిపోయింది.

Read More: undefined
తొలి సెట్‌ని ఆఖర్లో చిన్న తప్పిదాల కారణంగా చేజార్చుకున్న సింధు.. రెండో సెట్‌లో పుంజుకుంది. కానీ.. మళ్లీ ఆఖరి సెట్‌లో ఒత్తిడికి గురై సెట్‌తో పాటు మ్యాచ్‌ని కూడా చేజార్చుకుంది. పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్, ప్రణయ్ కూడా ఓడిపోయి ఇంటిబాట పట్టారు. కానీ.. కిదాంబి శ్రీకాంత్ మాత్రం ప్రీక్వార్టర్స్‌లో గెలిచి భారత్‌కి గెలుపు ఆశలురేపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.