యాప్నగరం

మలేషియాపై 4-1 తేడాతో నెగ్గిన భారత హాకీ జట్టు

మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. 4-1 తేడాతో మలేసియాను ఓడించిన భారత్ ఈ టోర్నీలో మూడోస్థానంతో సరిపెట్టుకుంది.

TNN 27 Nov 2016, 1:21 pm
నాలుగు దేశాల హాకీ టోర్నమెంటులో భాగంగా ఆదివారం మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. 4-1 తేడాతో మలేసియాను ఓడించిన భారత్ ఈ టోర్నీలో మూడోస్థానంతో సరిపెట్టుకుంది. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 2-3 తేడాతో ఓటమి పాలుకావడంతో ఫైనల్‌కు అర్హత కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోన్న ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరాయి. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. భారత జట్టు చేతిలో ఓడిపోవడంతో మలేసియా జట్టు నాలుగో స్థానానికి పరిమితమైంది.
Samayam Telugu india beat malaysia 4 1 to finish 3rd in the four nations hockey tournament
మలేషియాపై 4-1 తేడాతో నెగ్గిన భారత హాకీ జట్టు


మెల్‌బోర్న్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున అక్షదీప్, వీఆర్ రఘునాథ్, తల్విందర్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్‌లు గోల్స్ చేశారు. తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి 1-0 తో ఆధిక్యంలో ఉన్న భారత్, రెండో సగభాగంలో మరింత చెలరేగి ఆడింది. దీంతో మలేసియా ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఈ గెలుపుతో భారత్ కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.