యాప్నగరం

హాకీలో పాక్ చిత్తు.. ఫైనల్లో భారత్

ఆసియా కప్ హాకీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ని రెండోసారి మట్టికరిపించిన భారత్ సగర్వంగా ఫైనల్‌కి చేరింది. సూపర్-4లో

TNN 21 Oct 2017, 8:42 pm
ఆసియా కప్ హాకీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ని రెండోసారి మట్టికరిపించిన భారత్ సగర్వంగా ఫైనల్‌కి చేరింది. సూపర్-4లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో భారత్ జట్టు 4-0 తేడాతో పాక్‌పై ఘన విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయిస్తూ.. పాకిస్థాన్ గోల్ పోస్ట్‌లపై పదే పదే దాడులు చేస్తూ వచ్చిన భారత్ ఆటగాళ్లు చివరి వరకూ పాక్‌ని ఊపిరి పీల్చుకోనివ్వలేదు. దీంతో ఆ జట్టు కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఈ టోర్నీ గ్రూప్ దశలోనూ భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
Samayam Telugu india crush pakistan 4 0 to enter final
హాకీలో పాక్ చిత్తు.. ఫైనల్లో భారత్


ఇరు జట్లకీ ప్రతిష్ఠాత్మక మ్యాచ్ కావడంతో 39వ నిమిషం వరకూ ఒక గోల్ కూడా నమోదు కాలేదు. షబ్బీర్ సింగ్ చూడచక్కని గోల్‌తో మొదట భారత్ ఖాతా తెరవగా.. అనంతరం 51వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. దీంతో పాక్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. ఇదే అదునుగా భావించి భారత్‌కి.. నిమిషం వ్యవధిలోనే లలిత్ ఉపాధ్యాయ గోల్‌ చేసి ఆనందాన్ని రెట్టింపు చేయగా.. చివరగా 57వ నిమిషంలో గుర్జాంత్ సింగ్ గోల్‌తో ఆధిక్యాన్ని 4-0తో ముగించి భారత్‌‌ ఫైనల్ సంబరాలకి తెరలేపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.