యాప్నగరం

ఏషియన్ అథ్లెటిక్స్: చైనా ఆధిక్యానికి చెక్ పెట్టిన భారత్

ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ - 2017లో భారత్ చరిత్ర సృష్టించింది. 34 ఏళ్లుగా తిరుగులేని ఆధిక్యంతో ముందుకు సాగుతున్న చైనాను..

TNN 10 Jul 2017, 8:20 am
ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ - 2017లో భారత్ చరిత్ర సృష్టించింది. 34 ఏళ్లుగా తిరుగులేని ఆధిక్యంతో ముందుకు సాగుతున్న చైనాను వెనక్కి నెట్టి మరీ ఏషియన్ అథ్లెటిక్స్‌లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఆదివారం ఒక్కరోజే ఐదు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్య పతకాలను కొల్లగొట్టిన మన అథ్లెట్లు ఇండియాకు తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టారు. దీంతో కనివీని ఎరగని రీతిలో భారత్ 29 పతకాల (12 స్వర్ణాలు, 5 రజతాలు, 12 కాంస్యాలు) తో పతకాల పట్టికలో అగ్రస్థానాన్ని సాధించింది. 1985లో జకార్తాలో జరిగిన ఏషియన్ అథ్లెటిక్స్‌లో 22 పతకాలు సాధించడమే ఇప్పటి వరకూ భారత్‌కు అత్యధికం కాగా.. ఈసారి అంతకు మించి పతకాలను కొల్లగొట్టడం విశేషం.
Samayam Telugu india scripts history tops medal tally at asian athletics championships
ఏషియన్ అథ్లెటిక్స్: చైనా ఆధిక్యానికి చెక్ పెట్టిన భారత్


భారత అథ్లెట్లు అద్భుతంగా రాణించడంతో.. చైనా రెండో స్థానానికే పరిమితమైంది. 8 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్య పతకాలు సాధించిన చైనా.. 20 పతకాలతో సరిపెట్టుకుంది. 4 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలతో కజకిస్థాన్ మూడో స్థానంలో నిలిచింది. ఇరాన్ నాలుగో స్థానంలో నిలిచింది. 1973లో ఏషియన్ ఛాంపియన్‌షిప్స్ మొదలు కాగా.. 1981 వరకూ ఐదు ఎడిషన్లలో జపానే అగ్రస్థానంలో నిలిచింది. 1983లో కువైట్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్స్ నుంచి చైనా హవా మొదలైంది. రెండేళ్ల క్రితం వుహాన్‌లో జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్స్ వరకూ చైనానే తొలిస్థానంలో నిలిచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.