యాప్నగరం

భారత్‌కి వుషు గేమ్‌లో పతకాల పంట..!

ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్‌కి వుషు క్రీడలో బుధవారం నాలుగు కాంస్య పతకాలు లభించాయి. 60 కేజీల

Samayam Telugu 22 Aug 2018, 8:16 pm
ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్‌కి వుషు క్రీడలో బుధవారం నాలుగు కాంస్య పతకాలు లభించాయి. 60 కేజీల మహిళల విభాగంలో తొలుత పోటీపడిన రోషిబిని దేవి సెమీ ఫైనల్స్‌‌లో ఓడినా.. ఆమెకి రజత పతకం దక్కింది. అలానే.. 56 కేజీల పురుషుల విభాగంలో పోటీపడిన సంతోష్ కుమార్, 60 కేజీల విభాగంలో ఫైట్ చేసిన సూర్యభాను ప్రతాప్, 65 కేజీల విభాగంలో పోటీపడిన నరేందర్‌ గ్రేవాల్ ఈరోజు సెమీ ఫైనల్స్‌లో ఓడారు. అయినప్పటికీ.. వీరందరికీ కాంస్య పతకాలు లభించాయి. వుషు గేమ్‌లో సెమీస్‌లో ఓడిన వారికి కాంస్య పతకం ఇస్తారు. ఈరోజు 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ విభాగంలో పోటీపడిన రహీ జీవన్ సర్నోబత్ స్వర్ణం పతకం గెలిచిన విషయం తెలిసిందే.
Samayam Telugu 200


ఆసియా గేమ్స్‌లో నాలుగో రోజైన బుధవారానికి భారత్ పతకాల సంఖ్య 15కి చేరింది. ఇందులో 4 బంగారు పతకాలు ఉండగా.. 3 రజతం, 8 కాంస్యాలు ఉన్నాయి. పతకాల పట్టికలో చైనా 82 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ దేశం ఇప్పటికే 37 పసిడి పతకాలను గెలుపొందింది. రెండో స్థానంలో జపాన్ ( మొత్తం 68 పతకాలు), తర్వాత కొరియా (49), ఇరాన్ (16) ఉన్నాయి. ఈ పట్టికలో భారత్ స్థానం 7.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.