యాప్నగరం

భారత హాకీ లెజెండ్ బల్బీర్‌కు తీవ్ర అస్వస్థత

ఆడిన తొలి ఒలింపిక్స్ 1948 (లండన్‌) ఫైనల్లో రెండు గోల్స్ చేసి భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించారు.

Samayam Telugu 4 Oct 2018, 11:22 am
స్వతంత్ర భారతదేశం తరఫున ఒలింపిక్స్‌లో తొలి పతాకధారి, దేశంలో జీవించి ఉన్న అత్యంత వృద్ధ ఒలింపియన్ బల్బీర్ సింగ్ సీనియర్ బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హాకీ లెజెండ్ బల్బీర్‌కు చండీగఢ్‌లోని పీజీఐ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. 94 ఏళ్ల బల్బీర్‌ను ఐసీయూలో ఉంచినట్లు వైద్యులు తెలిపారు.
Samayam Telugu balbir singh


తాను ఆడిన తొలి ఒలింపిక్స్ 1948 (లండన్‌)లో ఫైనల్లో రెండు గోల్స్ చేసి భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించారు. 1952, 1956 ఇలా వరసగా మూడు ఒలింపిక్స్‌లలో స్వర్ణ పతకం సాధించిన భారత హాకీ జట్టులో బల్బీర్ కీలక ఆటగాడు. కెప్టెన్‌గా ఒలింపిక్ స్వర్ణం అందించిన 1956 ఒలింపిక్స్ బల్బీర్‌కు చాలా ప్రత్యేకం. పద్మశ్రీ అందుకున్న తొలి క్రీడాకారుడు హాకీ లెజెండ్ బల్బీర్ కావడం గమనార్హం.

1975లో ప్రపంచ కప్ సాధించిన భారత హాకీ జట్టుకు ప్రధాన కోచ్, మేనేజర్‌గానూ బల్బీర్ వ్యవహరించారు. హాకీ మాంత్రికుడు, దిగ్గజ ఆటగాడు ధ్యాన్‌చంద్‌తో కలిసి ఆడినప్పటికీ ఆయనకొచ్చినంత గుర్తింపు బల్బీర్‌కు రాలేదన్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.