యాప్నగరం

Tokyo olympicsకు నీరజ్ చోప్రా అర్హత

గాయం నుంచి కోలుకున్న భారత జావెలిన్ ఆటగాడు నీరజ్ చోప్రా సత్తాచాటాడు. తాజాగా జరిగిన ఒక టోర్నీలో ఆకట్టుకుని, ఒలింపిక్ బెర్త్ సాధించాడు. ఈ ఏడాది జూలై 24 నుంచి ఒలింపిక్స్ పోటీలు ప్రారంభంకానున్నాయి.

Samayam Telugu 29 Jan 2020, 1:03 pm
ఈ ఏడాది జపాన్ రాజధాని టోక్యోలో జరిగే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు భారత జావెలిన్ ఆటగాడు నీరజ్ చోప్రా అర్హత సాధించాడు. సౌతాఫ్రికాలో జరుగుతున్న ద అథ్లెటిక్ సెంట్రల్ నార్త్ ఈస్ట్ మీటింగ్‌ టోర్నీలో అత్యుత్తమ ఆటతీరు కనబర్చిన నీరజ్.. ఒలింపిక్ బెర్త్‌ను కైవసం చేసుకున్నాడు. మోచేతి గాయం నుంచి రెండేళ్లుగా ఆటకు దూరమైన నీరజ్.. పునరాగమం చేసిన ఆరంభంలోనే మెగాటోర్నీకి అర్హత సాధించడం విశేషం.
Samayam Telugu indian javelin thrower neeraj chopra qualifies for tokyo olympics 2020
Tokyo olympicsకు నీరజ్ చోప్రా అర్హత

Read Also : Hamilton T20: భారత్ బ్యాటింగ్.. కివీస్‌లో ఒక మార్పు

ఈ టోర్నీలో జావెలిన్‌ను 87.86 మీటర్ల దూరం విసిరిన నీరజ్.. ఒలింపిక్ ప్రమాణాలకు అనుగుణంగా ఆటతీరు కనబర్చాడు. మరోవైపు ఈ టోర్నీకి ఒలింపిక్ సంఘం గుర్తింపు ఉంది అని భారత అథ్లెటిక్ సమాఖ్య (ఏఎఫ్ఐ) స్పష్టం చేసింది.

Read Also : ICC U-19 World Cup: భారత్ వరల్డ్ రికార్డు
మరోవైపు నీరజ్ చోప్రా రెండేళ్ల కిందట జరిగిన ఆసియా క్రీడల్లో ఆడాడు. ఇండోనేసియా రాజధాని జకార్తలో జరిగిన ఈ టోర్నీలో జావెలిన్‌ను 88.06 మీటర్ల దూరం విసిర గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. అప్పట్లో అది జాతీయ రికార్డు కూడా కావడం విశేషం. ఆ తర్వాత గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు. పునరాగమనంలో ఒలింపిక్ బెర్త్ సాధించడంపై నీరజ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఒలింపిక్ క్రీడలు ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరుగుతాయి.

Read Also : Chahal Troll: కోహ్లీ, రాహుల్.. నా షాట్‌నే కాపీ కొడతారా? యువకుల్లారా కానివ్వండి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.