యాప్నగరం

కరోనా ఎఫెక్ట్‌: మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క టోర్నీ వాయిదా

సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ వచ్చే నెల 27 నుంచి మే 3 వరకు జరగాల్సి ఉంది. గతేడాది ఈ టోర్నీలో గెలిచిన సైనా నెహ్వాల్, సౌర‌భ్ వ‌ర్మ ఈసారి డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగుతున్నారు.

Samayam Telugu 25 Mar 2020, 9:12 pm
క‌రోనా వైరస్ క్రీడా రంగంపై అనేక రకాలుగా ప్రభావం పడుతోంది. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌), ఒలింపిక్స్‌లాంటి ప్రతిష్టాత్మ‌క టోర్నీలు వాయిదా పడగా.. తాజాగా జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను పోస్ట్‌పోన్ చేశారు. అలాగే స్టేట్ ఇంటర్ జోనల్ టోర్నీ కూడా వాయిదా వేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. టోర్నీని వాయిదా వేయ‌డం బాధాకరమే అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్‌పై పోరాటానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పరిస్థితి అదుపులోకి వచ్చాక తామంతా సమావేశమై, తిరిగి టోర్నీని ఎప్పుడు నిర్వ‌హిస్తామోన‌ని స్పష్టం చేశాడు.
Samayam Telugu **YEARENDER 2019: SPORTS** Basel: Indias Saina Nehwal returns a shuttlecock to ...
Saina Nehwal


Read Also:CSK, RCBలపై ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

నిజానికి ఈ టోర్నీ.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లో వ‌చ్చేనెల 27 నుంచి మే 3 వరకు జరగాల్సి ఉంది. వాయిదా వేయడంతో దేశంలోని బ్యాడ్మింట‌న్ సంఘాలు ల‌క్నోకు టికెట్ బుక్ చేయకూడదని స్పష్టం చేశారు. గతేడాది జరిగిన ఈ టోర్నీలో పురుషుల విభాగంలో సౌర‌భ్ వ‌ర్మ‌, మహిళల విభాగంలో సైనా నెహ్వాల్‌ విజేతగా నిలిచారు. ఈసారి ఈ టోర్నీలో డిఫెండింగ్ వీళ్లు బ‌రిలోకి దిగ‌నున్నారు.

Read Also:

మ‌రోవైపు క‌రోనా వైర‌స్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు లక్షల మందికి పైగా ఈ వైరస్ ప్రభావానికి గురయ్యారు. మ‌రో 18 వేల మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఇండియాలోనూ ఈ వైరస్ మెల్ల మెల్లగా విస్తరిస్తోంది. ఇండియాలో ఇప్పటికీ 600 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. 11 మంది ఈ మహమ్మారికి బ‌ల‌య్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.