యాప్నగరం

కరోనా ఫైట్..ప్రభుత్వానికి బాక్సర్ మేరీకోమ్ చేయూత

భార‌త సీనియ‌ర్ మ‌హిళా బాక్స‌ర్ మేరీ కోమ్‌ రికార్డు స్థాయిలో ఆరుసార్లు ప్ర‌పంచ చాంపియ‌న్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం ఆమె రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

Samayam Telugu 30 Mar 2020, 10:49 pm
ప్రమాదకర కరోనా వైరస్‌పై పోరాటానికి ఆరుసార్లు బాక్సింగ్ ప్రపంచ‌ చాంపియ‌న్ మేరీ కోమ్ ముందుకొచ్చింది. రాజ్య‌స‌భ స‌భ్యురాలైన మేరీ కోమ్ త‌న నెల జీతాన్ని ప్ర‌భుత్వానికి విరాళంగా అంద‌జేస్తున్న‌ట్లు తెలిపింది. అలాగే ఎంపీల్యాడ్స్ నిధుల నుంచి రూ.కోటిని అందించ‌నున్న‌ట్లు తాజాగా ట్వీట్ చేసింది. క‌రోనాపై పోరాడేందుకు అంద‌రూ ఇళ్ల‌ల్లోనే ఉండాల‌ని సూచించింది. స్టే హోమ్‌, స్టే హోం స్టే సేఫ్‌, ఇండియా ఫైట్స్ క‌రోనా అని పేర్కొంటూ హ్యాష్‌ట్యాగ్‌ల‌ను జ‌త చేసింది.
Samayam Telugu New Delhi: Boxer Mary Kom during her bout against Nikhat Zareen in the 51kg cate...
Boxer Mary Kom


Read Also: రీఎంట్రీ కోసం ధోనీ సన్నాహకాలు భేష్: సీఎస్‌కే కోచ్‌

మ‌రోవైపు రోజురోజుకు విస్త‌రిస్తున్న క‌రోనా వైర‌స్‌ను అడ్డుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు క‌ఠిన చ‌ర్య‌ల‌ను తీసుకుంది. ఇప్ప‌టికే 21 రోజుల‌పాటు లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించింది. దీంతో దేశవ్యాప్తంగా వ‌చ్చేనెల 14 వ‌ర‌కు స్తంభించిపోనుంది. అలాగే క‌రోనాపై పోరుకు అంతా ముందుకొచ్చి, త‌మ వంతు సాయం అందించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తాజాగా పిలుపునిచ్చిన‌ సంగ‌తి తెలిసిందే.

Read Also: టోక్యో ఒలింపిక్స్ 2021 కొత్త తేదీల ఖరారు

ప్ర‌ధాని మోదీ పిలుపునందుకుని క్రికెట‌ర్లు స‌చిన్ టెండూల్క‌ర్‌, గౌతం గంభీర్‌, బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా విరాళాలు అందించారు. అలాగే బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ పీవీ సింధు, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, షూట‌ర్ ఇషా, మ‌హిళా క్రికెట‌ర్ రిచా ఘోష్‌, అథ్లెట్లు హిమా దాస్‌, ద్యుతీ చంద్ త‌దిత‌రులు త‌మ వంతు సాయాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.