యాప్నగరం

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కి రెడ్డికి కరోనా పాజిటివ్

హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో వారం క్రితం షట్లర్లకి క్యాంప్‌ ప్రారంభమవగా.. దానికి హాజరవుతున్న ఇద్దరికి తాజాగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో అకాడమీని శానిటైజేషన్ కోసం మూసివేశారు.

Samayam Telugu 13 Aug 2020, 11:05 pm
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కి రెడ్డికి కరోనా వైరస్ సోకింది. హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీలో ఇటీవల ప్రారంభమైన క్యాంప్‌నకి హాజరైన సిక్కిరెడ్డి‌తో పాటు ఫిజియోథెరపిస్ట్ కిరణ్‌ కూడా కరోనా వైరస్ బారినపడినట్లు తేలింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. గత మార్చి నుంచి ఆటకి దూరంగా ఉన్న షట్లర్లు.. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టేడియాలు, అకాడమీల్లో ప్రాక్టీస్‌కి అనుమతి ఇవ్వడంతో టోక్యో ఒలింపిక్స్ కోసం సన్నద్ధతని మొదలెట్టారు.
Samayam Telugu Sikki Reddy, Ashwini Ponnappa
Ashwini Ponnappa and Sikki Reddy. (Getty Images)


బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పర్యవేక్షణలో ఇటీవల ఈ క్యాంప్ ప్రారంభమవగా.. షట్లర్లు పీవీ సింధు, సిక్కిరెడ్డి, సాయి ప్రణీత్ ఈ క్యాంప్‌నకి హాజరయ్యారు. అయితే.. ఆటగాళ్లతో పాటు కోచ్‌‌లు, సపోర్ట్ స్టాఫ్‌‌కి విధిగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని ఇటీవల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆదేశించింది. దాంతో.. గోపీచంద్ అకాడమీలో పరీక్షలు నిర్వహించగా.. సిక్కిరెడ్డితో పాటు కిరణ్‌కి పాజిటివ్‌గా తేలింది. కానీ.. వారిలో ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేవని తెలుస్తోంది.

క్యాంప్‌నకి హాజరైన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. గోపీచంద్ అకాడమీని శానిటైజేషన్ కోసం తాత్కాలికంగా మూసివేశారు. సిక్కిరెడ్డితో క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్న షట్లర్ల‌కి మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల బెంగళూరులో ఏర్పాటు చేసిన హాకీ క్యాంప్‌‌లో ఏకంగా ఐదుగురు ఆటగాళ్లకి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.