యాప్నగరం

ఆసియా క్రీడలు: టెన్నిస్‌లో భారత్‌కు కాంస్యం

ఇండోనేసియాలో జరుగుతోన్న ఆసియా క్రీడల్లో భారత్ మరో పతకం సాధించింది. మహిళల టెన్నిస్ సింగిల్స్‌లో అంకితా రైనా కాంస్య పతకం గెలుచుకుంది.

Samayam Telugu 23 Aug 2018, 1:21 pm
ఇండోనేసియాలో జరుగుతోన్న ఆసియా క్రీడల్లో భారత్ మరో పతకం సాధించింది. మహిళల టెన్నిస్ సింగిల్స్‌లో అంకితా రైనా కాంస్య పతకం గెలుచుకుంది. సెమీ ఫైనల్లో చైనాకు చెందిన షుయీ ఝంగ్‌పై అంకిత 4-6, 6-7 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయింది. అంకిత ఆసియా క్రీడల్లో పాల్గొనడం ఇది రెండోసారి కాగా, ఇదే తొలి పతకం. కాంస్యం సాధించిన అంకితను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్విట్టర్ ద్వారా అభినందించింది.
Samayam Telugu Ankitha

కాగా, అంకిత కాంస్యంతో భారత పతకాల సంఖ్య 16కు చేరింది. ఇప్పటి వరకు భారత్ 4 స్వర్ణ, 3 రజత, 9 కాంస్య పతకాలు సాధించింది. ఇదిలా ఉంటే, పురుషుల టెన్నిస్ సింగిల్స్ ఫైనల్లో భారత జోడి రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ ఫైనల్‌కు చేరారు. సెమీ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన కియాటో యుసుగి, షో షిమబుకురో జంటపై 4-6, 6-3, 10-8 తేడాతో బోపన్న, శరణ్ జోడి గెలుపొందింది. మరో సెమీఫైనల్లో బుబ్లిక్, డెనిస్ యెవ్సెయెవ్ (కజఖ్‌స్థాన్) జంటతో యొసుకే వటనుకి, ఇటో యుయా (జపాన్) జోడి పోటీపడనుంది. దీనిలో గెలిచిన జోడీతో బోపన్న, శరణ్ జంట ఫైనల్‌లో తలపడుతుంది.

ఇప్పటి వరకు భారత్ గెలిచిన పతకాల్లో అత్యధికంగా షూటింగ్‌లో 7 (2 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలు) ఉన్నాయి. ఇక రెజ్లింగ్‌లో 3 (2 స్వర్ణాలు, 1 కాంస్యం), సెపక్ తక్రాలో ఒక కాంస్యం, టెన్నిస్‌లో ఒక కాంస్యం, ఉషులో నాలుగు కాంస్య పథకాలు భారత్ గెలుచుకుంది. మొత్తంగా పతకాల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 100 పతకాలతో చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.