యాప్నగరం

Hyderabadi టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జైత్రయాత్ర

అంతర్జాతీయ టెన్నిస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన భారత ప్లేయర్ సానియా వరుసగా రెండో విజయం సాధించింది. హోబర్ట్ టోర్నీలో మహిళల డబుల్స్‌ విభాగంలో సెమీస్‌‌కు చేరింది.

Samayam Telugu 16 Jan 2020, 10:32 pm
రెండేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ టెన్నిస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన భారత ఏస్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియాలోని హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీలో తను వరుసగా రెండో విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. శుక్రవారం సెమీస్‌లో తలపడనుంది.
Samayam Telugu sania mirza1



అంతకుముందు గురువారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-నాడియా కిచెనోక్ (ఉక్రెయిన్) జంట 6-2, 4-6, 10-4తో వానియా కింగ్-క్రిస్టీనా మిషెల్లీ జంటపై విజయం సాధించింది. గంటా 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్ నెగ్గిన సానియా జంట.. తర్వాతి సెట్ ఓడిపోయింది. ఈ దశలో తన అనుభవన్నంతా రంగరించిన హైదరాబాదీ ప్లేయర్.. సూపర్ టైబ్రేకర్‌లో నెగ్గి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. సెమీస్‌లో బౌజుకోవా-జిదాన్సెక్ జంటతో సానియా ద్వయం తలపడనుంది.

Read Also : IND vs AUS 2nd ODI: భారత తుది జట్టు.. కారణలివే..!
చివరిసారిగా 2017 అక్టోబర్‌లో చైనా ఓపెన్‌లో బరిలోకి దిగిన సానియా.. రెండేళ్ల తర్వాత మళ్లీ బుధవారమే అంతర్జాతీయ టోర్నీల్లోకి అడుగుపెట్టింది. మరో రెండు విజయాలు సాధిస్తే తన కెరీర్‌లో మరో డబుల్స్ టైటిల్ దక్కించుకుంటుంది. గతంలో మహిళల డబుల్స్‌లో ప్రపంచ నం.1గా నిలిచిన సానియా.. ఆరు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకోవడం విశేషం. కుమారునికి జన్మనివ్వడం కోసం సానియా రెండేళ్ల బ్రేక్ తీసుకుంది.

Read Also : పేరెంట్స్‌గా మారిన కివీస్ లెస్బియన్ క్రికెటర్స్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.