యాప్నగరం

ట్రయల్స్‌కి నో చెప్పిన భారత్ ఉసేన్ బోల్ట్

కంబాళ రేసులో తన వేగంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన శ్రీనివాస గౌడ.. ట్రయల్స్‌లో పోటీ పడేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో.. భారత్ ఉసేన్ బోల్ట్ కథ ముగిసిపోయినట్లేనా..?

Samayam Telugu 17 Feb 2020, 6:46 pm
భారత్ ఉసేన్ బోల్ట్‌గా పేరొందిన శ్రీనివాస గౌడ ఊహించని రీతిలో అందరికీ ట్విస్ట్ ఇచ్చాడు. కర్ణాటకలోని మంగళూరులో ఇటీవల జరిగిన ‘కంబాళ’ పోటీల్లో 142.5 మీటర్ల దూరాన్ని కేవలం 13.62 సెకన్లలో పూర్తి చేసిన శ్రీనివాస గౌడ.. అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడికి మెరుగైన శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్‌కి పంపించాలని చాలా మంది ప్రముఖులు సూచించడంతో.. కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజు స్వయంగా స్పందించి అతనికి ఒకసారి ట్రయల్స్‌ నిర్వహించాల్సిందిగా ‘ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ అధికారుల్ని ఆదేశించాడు.
Samayam Telugu Kambala,Kambala jockey Srinivasa Gowda


కంబాళ పోటీలో శ్రీనివాస గౌడ వేగాన్ని లెక్కించిన ఓ నెటిజన్.. 100మీ పరుగుని కేవలం 9.55 సెకన్లలోనే పూర్తి చేసినట్లు తేల్చాడు. అంటే.. జమైకా పరుగుల వీరుడు ఉసేన్‌ బోల్ట్ కంటే 3 సెకన్ల ముందే 100మీ పరుగుని శ్రీనివాస్ పూర్తి చేశాడన్నమాట. ఈ మేరకు శ్రీనివాస్ గౌడ్ రేస్‌లో పోటీపడుతున్న వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దీంతో.. అది నిమిషాల్లోనే వైరల్‌గా మారిపోయింది. మంత్రి ఆదేశాలు, సెలబ్రిటీల అభ్యర్థనలతో అతనికి ట్రయల్స్‌ నిర్వహించేందుకు సాయ్ ముందుకొచ్చింది. కానీ.. శ్రీనివాస గౌడ మాత్రం తాను ట్రయల్స్‌లో పోటీపడనని తేల్చి చెప్పేసినట్లు వార్తలు వస్తున్నాయి.

సోమవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడిన శ్రీనివాస్ గౌడ.. ‘కంబాళ రేసులో నా కాలి మడమ సాయంతో వేగంగా పరుగెత్తగలను. కానీ.. ట్రయల్స్‌లో సింథటిక్ ట్రాక్‌పై షూస్‌తో అదే వేగమంటే కష్టం. ఇంకా చెప్పాలంటే.. కంబాళ పోటీలో జాకీకి దున్నల నుంచి కూడా సపోర్ట్ లభిస్తుంది. ట్రాక్‌పై ఆ సపోర్ట్ ఉండదు. అందుకే నేను ట్రయల్స్‌లో పోటీపడను.. కంబాళపైనే దృష్టి సారిస్తాను’ అని చెప్పినట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.