యాప్నగరం

పాక్ గడ్డపై భారత్ కబడ్డీ టీమ్..? IOA షాక్

కబడ్డీ టోర్నీలో ఆడేందుకు భారత్ జట్టు పాకిస్థాన్ గడ్డపైకి వెళ్లిందా..? అదీ అధికారికంగా అనుమతి తీసుకోకుండా.. వాఘా సరిహద్దు ద్వారా.. సాధ్యమేనా..? లేదా పాకిస్థాన్ జిత్తులమారి ఎత్తులా..?

Samayam Telugu 10 Feb 2020, 9:23 pm
పాకిస్థాన్ గడ్డపై జరుగుతున్న కబడ్డీ వరల్డ్ ఛాంపియన్‌‌షిప్‌లో ఆడేందుకు భారత కబడ్డీ టీమ్ అక్కడికి వెళ్లడంపై వివాదం చెలరేగింది. ఇండియన్ ఒలింపిక్స్ అసోషియేషన్ (ఐఓఏ) తాము టీమ్‌కి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేయగా.. కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ, అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎకేఎఫ్ఐ) కూడా తమకి ఆ టీమ్‌ గురించి ఎలాంటి సమాచారం తెలీదని ప్రకటించాయి. దీంతో.. పాక్ గడ్డపైకి అసలు భారత్ జట్టు వెళ్లిందా..? లేదా పాక్ పుకార్లు పుట్టించిందా..? అనే సందేహాలు నెలకొన్నాయి.
Samayam Telugu India Kabaddi team,Pakistan


భారత కబడ్డీ జట్టు గత శనివారం వాఘా సరిహద్దు ద్వారా గత లాహోర్‌కి చేరుకున్నట్లు వార్తలు వచ్చాయి. అక్కడ ఘన స్వాగతం అనంతరం భారీ భద్రత నడుమ లాహోర్‌లోని హోటల్‌కి తరలించినట్లు కూడా అందులో పేర్కొన్నారు. దీంతో.. విచారణ జరిపిన ఐఓఏ చీఫ్ నరీందర్ బత్రా ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ‘పాక్ గడ్డపై టోర్నీలో ఆడేందుకు కబడ్డీ టీమ్‌కి ఐఓఏ ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. అలానే ఐఓఏ భాగమైన ఫెడరేషన్ (ఎకేఎఫ్ఐ) కూడా తాము అధికారికంగా టీమ్‌ని పంపలేదని తెలిపింది. కాబట్టి.. ఆ టీమ్ ఎవరో..? నాకు తెలీదు. మంత్రిత్వ శాఖ కూడా తాము ఏ టీమ్‌కి అనుమతి ఇవ్వలేదని ప్రకటించింది. కాబట్టి.. పాక్ గడ్డపై ఉన్న టీమ్ ఎవరో..? వారి వెనుక ఉన్న కథేంటో..? తెలీదు’ అని స్పష్టం చేశారు.

లాహోర్‌లోని పంజాబ్ ఫుట్‌బాల్ స్టేడియం వేదికగా సోమవారం నుంచి కబడ్డీ టోర్నీలో మొదలుకానుంది. 2010-19 మధ్యకాలంలో ఆరు సార్లు వరల్డ్ కబడ్డీ ఛాంపియన్‌‌షిప్‌కి ఆతిథ్యమిచ్చిన భారత్.. అన్ని సీజన్లలోనూ విజేతగా నిలిచింది. ఇరు దేశాల మధ్య సామరస్య వాతావరణం లేకపోవడంతో అంతర్జాతీయ పోటీల్లో.. అదీ తటస్థ వేదికలపై మాత్రమే పాక్‌తో భారత్ పోటీపడుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.