యాప్నగరం

ఆరంభ మ్యాచ్‌లో చేజేతులా ఓడిన భారత జట్టు

వరల్డ్ కప్ కబడ్డీ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ కొరియా చేతిలో చేజేతులా ఓటమి పాలైంది.

TNN 7 Oct 2016, 10:26 pm
అహ్మదాబాద్: వరల్డ్ కప్ కబడ్డీ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య భారత జట్టుకు ఊహించని షాక్ ఎదురైంది. దక్షిణా కొరియా జట్టు ఇండియాను 34-32 తేడాతో ఓడించింది. కబడ్డీలో భారత్‌పై కొరియా విజయం సాధించడం ఇదే ప్రథమం కావడం విశేషం. తొలి అర్థ భాగం ముగిసే సరికి భారత్ 18-13 తేడాతో ఆధిక్యంలో ఉంది. చివరి వరకు భారత్‌దే ఆధిక్యం కొనసాగింది. కానీ చివరి రెండు నిమిషాల్లో చేసిన అనవసర తప్పిదాల వల్ల ఇండియా ఓటమి పాలైంది. మ్యాచ్ చివరి వరకూ అద్భుతంగా పోరాడిన కొరియా జట్టు అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ వరల్డ్ కప్ కబడ్డీలో భారత్‌కు తిరుగు లేదు. కానీ ఈసారి మాత్రం ఇరాన్, కొరియా నుంచి గట్టి పోటీ ఎదురు కావచ్చనే అంచనాలు ఉన్నాయి. తొలి మ్యాచ్ ఈ విషయాన్నే రుజువు చేసింది. మరో మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన ఇరాన్ అమెరికాపై 52-15 తేడాతో ఘన విజయం సాధించింది.
Samayam Telugu kabaddi world cup 2016 korea stun india 34 32 in opener
ఆరంభ మ్యాచ్‌లో చేజేతులా ఓడిన భారత జట్టు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.