యాప్నగరం

ఇండోనేసియా ఓపెన్ ఫైనల్ చేరిన శ్రీకాంత్

సెమీస్‌లో 72 నిమిషాల పాటు హోరా హోరీగా సాగిన పోరులో తొలి సెట్‌ని అలవోకగా గెలుచుకున్న శ్రీకాంత్.. రెండో సెట్‌‌ చివర్లో తడబడ్డాడు.

TNN 18 Jun 2017, 1:13 pm
ఇండోనేసియా ఓపెన్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరాడు. టోర్నీలో భాగంగా కొరియాకి చెందిన ప్రపంచ నెం.1 సాన్ వాన్ హొతో శనివారం జరిగిన సెమీస్‌లో 21-15, 20-22, 21-16‌తో శ్రీకాంత్ గెలుపొందాడు. అయితే టోర్నీ ఆరంభంలోనే సంచలన విజయాలతో అందరినీ ఆకర్షించిన మరో భారత యువ ఆటగాడు ప్రణయ్ మాత్రం అనూహ్య ఓటమితో నిష్క్రమించాడు. జపాన్‌కి చెందిన కజుమస సకాయ్‌తో జరిగిన సెమీస్ పోరులో ప్రణయ్ 21-17, 26-28, 18-21తో పరాజయం చవిచూశాడు.
Samayam Telugu kidambi srikanth through to final
ఇండోనేసియా ఓపెన్ ఫైనల్ చేరిన శ్రీకాంత్


సెమీస్‌లో 72 నిమిషాల పాటు హోరా హోరీగా సాగిన పోరులో తొలి సెట్‌ని అలవోకగా గెలుచుకున్న శ్రీకాంత్.. రెండో సెట్‌‌ చివర్లో తడబడ్డాడు. దీంతో మూడో సెట్ ఆట ఆసక్తికరంగా మారింది. సాన్ వాన్ హొ పుంజుకుని శ్రీకాంత్‌కి గట్టి పోటీనిచ్చాడు. అయితే.. తనదైన బలమైన స్మాష్‌లతో విరుచుకుపడిన శ్రీకాంత్ సెట్‌ని మూడు పాయింట్ల తేడాతో చేజిక్కించుకుని ఫైనల్ చేరాడు. మరోవైపు 77 నిమిషాల పాటు విజయం కోసం ప్రణయ్ పోరాడినా ఫలితం లేకపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.