యాప్నగరం

చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌ని ఫైనల్‌కి చేర్చిన హంపీ

చెస్ ఒలింపియాడ్‌లో ఈసారి భారత్ గోల్డ్‌ మెడల్ సాధించేలా కనిపిస్తోంది. ఫైనల్‌కి చేరడం ద్వారా ఇప్పటికే సిల్వర్‌ని ఖాయం చేసుకున్న భారత్.. ఈరోజు తుది పోరులో రష్యాతో ఢీకొట్టనుంది.

Samayam Telugu 30 Aug 2020, 1:55 pm
చెస్ ఒలింపియాడ్‌లో భారత్ 93 ఏళ్ల టైటిల్ నిరీక్షణకి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆన్‌లైన్‌లో జరుగుతున్న చెస్ ఒలింపియాడ్‌లో అంచనాల్ని అందుకుంటూ భారత్‌ ఏకంగా ఫైనల్‌లో అడుగుపెట్టింది. టోర్నీ సెమీ ఫైనల్‌ టైగా ముగియగా.. ఆర్మగెడాన్ మ్యాచ్‌లో మన తెలుగమ్మాయి కోనేరు హంపి అద్వితీయ ప్రదర్శనతో భారత్‌ని ఫైనల్‌కి చేర్చింది. 1927 నుంచి చెస్ ఒలింపియాడ్ జరుగుతుండగా.. ఇప్పటి వరకూ భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన 2014లో కాంస్య పతకం గెలవడమే.
Samayam Telugu Humpy Koneru
Koneru Humpy file photo ( @FIDE_chess Twitter handle)


చెస్ ఒలింపియాడ్‌లో ఫైనల్‌కి చేరడం ద్వారా కనీసం రజత పతకం ఖాయం చేసుకున్న భారత్.. ఆదివారం జరగనున్న తుది పోరులో రష్యాతో ఢీకొట్టబోతోంది. భారత్ జట్టు సెమీస్‌లో పోలాండ్‌ని ఓడించి ఫైనల్‌కి చేరగా.. అమెరికాని ఓడించిన రష్యా తుది పోరుకి అర్హత సాధించింది. సెమీ ఫైనల్లో భారత్‌కి ఊహించని విజయాన్ని అందించిన హంపీ.. ఫైనల్లో రష్యాకి చెందిన అలెగ్జాండ్రా కోస్టెనిక్‌తో తలపడనుంది.

ఫైనల్లో రష్యాన్ని భారత్ ఓడించగలిగితే..? మన 93 ఏళ్ల చెస్ ఒలింపియాడ్ టైటిల్ నిరీక్షణకి తెరపడనుంది. సెమీస్‌లో అగ్రశ్రేణి ఆటగాళ్లు సైతం తీవ్ర ఒత్తిడికి గురైనట్లు చెప్పుకొచ్చిన హంపీ.. అర్మగెడాన్ మ్యాచ్‌ చాలా ఉత్కంఠగా జరిగినట్లు చెప్పుకొచ్చింది. మరి ఫైనల్‌‌లో భారత్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో..? చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.