యాప్నగరం

మలేసియా మాస్టర్స్‌లో సింధు, సైనా ఓటమి.. ముగిసిన భారత్ పోరాటం

మలేసియా మాస్టర్స్‌లో భారత్‌‌కి నిరాశే ఎదురైంది. క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన సింధు, సైనా నిమిషాల వ్యవధిలోనే వరుస సెట్లలో ఓడి ఇంటిబాట పట్టారు. దీంతో.. టోర్నీలో భారత్ పతక ఆశలకి తెరపడింది.

Samayam Telugu 10 Jan 2020, 5:51 pm
కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న మలేసియా మాస్టర్స్‌లో భారత్ పోరాటం ముగిసింది. టోర్నీలో వరుసగా రెండు విజయాలతో పతక ఆశలు రేపిన భారత మహిళా షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్.. క్వార్టర్స్‌లో పేలవంగా ఓడిపోయి ఇంటిబాట పట్టారు. ఇప్పటికే కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్‌ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
Samayam Telugu **YEARENDER 2019: SPORTS** Basel: Indias Saina Nehwal returns a shuttlecock to ...


మహిళల సింగిల్స్‌లో భాగంగా ఈరోజు స్పెయిన్ స్టార్ షట్లర్ కరోలినా మారిన్‌తో తలపడిన సైనా నెహ్వాల్ పేలవ రీతిలో 8-21, 7-21 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. అరగంటలోపే ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనా కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది.

మరో షట్లర్ పీవీ సింధు.. చైనీస్ తైపీ షట్లర్ తై జు యింగ్‌తో ఢీకొట్టి 16-21, 16-21 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయింది. సింధు ఇలా తై జు చేతిలో ఓడిపోవడం ఇది 12వసారి కాగా.. కేవలం 5 ఐదు సార్లు మాత్రమే ఆమెపై గెలిచిన రికార్డ్ ఉంది.

గత ఏడాది వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ గెలిచిన తర్వాత పీవీ సింధు.. అన్ని టోర్నీల్లోనూ విఫలమవుతూ వస్తోంది. ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో.. సింధు ఫామ్ ఇప్పుడు భారత్ అభిమానుల్లో కంగారు పెంచుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.