యాప్నగరం

Boxer Nikhat Zareen : భారత్‌కి గోల్డ్ మెడల్ అందించిన తెలుగు బాక్సర్.. మేరీకోమ్ సరసన నిఖత్

World Boxing Championship లో ఈ ఏడాది భారత్‌కి మూడో గోల్డ్ మెడల్ దక్కింది. శనివారం నీతు, స్వీటి బంగారు పతకాల్ని గెలుపొందగా.. ఈరోజు తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పసిడి పతకాన్ని గెలుపొందింది. ఈ క్రమంలో మేరీకోమ్ తర్వాత వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఒకటి కంటే ఎక్కువ పతకాన్ని గెలుపొందిన రెండో భారత బాక్సర్‌గా నిఖత్ జరీన్ నిలిచింది. గత ఏడాది కూడా ఈమె 52కేజీల విభాగంలో పోటీపడి...

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 26 Mar 2023, 7:20 pm

ప్రధానాంశాలు:

  • వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌‌లో భారత్‌కి మూడో గోల్డ్
  • ఆదివారం పసిడి గెలిచిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్
  • వరుసగా రెండో ఏడాది స్వర్ణం సాధించిన నిఖత్
  • ఓవరాల్‌గా 13కి చేరిన భారత్ పతకాల సంఖ్య
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Nikhat Zareen gold Medal
నిఖత్ జరీన్‌కి గోల్డ్ మెడల్
వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌ (World Boxing Championship)లో భారత్‌కి మరో గోల్డ్‌ మెడల్ (gold Medal) దక్కింది. ఈ మెగా టోర్నీలో 50 కేజీల విభాగంలో పోటీపడిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat Zareen) ఆదివారం జరిగిన ఫైనల్లో వియత్నాం బాక్సర్‌ న్యూయెన్‌పై 5-0 తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో గత ఏడాది కూడా గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్.. వరుసగా రెండో సారి భారత్‌కి పసిడి అందించింది. అలానే ఈ టోర్నీలో ఒకటి కంటే ఎక్కువ సార్లు మెడల్ సాధించిన రెండో భారత బాక్సర్‌గా నిఖత్ జరీన్ నిలిచింది.
వాస్తవానికి గత ఏడాది 52 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ పోటీపడింది. కానీ.. ఈ ఏడాది 50 కేజీల కేటగిరీలోకి మారిన నిఖత్ జరీన్.. అంచనాలకి మించి ప్రదర్శనని కనబరుస్తూ తుది పోరుకి చేరుకుంది. ఈ క్రమంలో ఒక్క క్వార్టర్స్‌లో మాత్రమే నిఖత్ కాస్త ఇబ్బంది పడినట్లు కనిపించింది. కానీ.. తొలిసారి ఫైనల్లో ఆడిన న్యూయెన్‌కి నిఖత్ జరీన్ ఈరోజు చుక్కలు చూపించేసింది. నిఖత్ పంచ్‌ల దెబ్బకి ఏ దశలోనూ వియత్నాం బాక్సర్ కోలుకోలేకపోయింది. ఇప్పటికే ఆసియా క్రీడలకి అర్హత సాధించిన నిఖత్ జరీన్.. 2024 పారిస్ ఒలింపిక్స్‌‌కి అర్హత సాధించే దిశగా అడుగులు వేస్తోంది.

వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌ 2023లో నీతు గాంగాస్, స్వీటి బూర శనివారం రెండు గోల్డ్ మెడల్స్‌ని భారత్‌కి అందించిన విషయం తెలిసిందే. 48 కేజీల విభాగంలో పోటీపడిన నీతు.. మంగోలియా బాక్సర్‌పై 5-0 తేడాతో విజయం సాధించింది. అలానే 84 కేజీల విభాగంలో పోటీపడిన స్వీటీ.. చైనా బాక్సర్ వాంగ్ లీనాపై 4-3 తేడాతో గెలుపొందింది.

ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌ ఇప్పటి వరకు భారత్ గెలిచిన స్వర్ణాల సంఖ్య 13కి చేరింది. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్‌ ఆరు సార్లు విజేతగా నిలిచింది. ఆమె 2002, 2005, 2006, 2008, 2010, 2018లో గోల్డ్ మెడల్స్ గెలిచింది. అలానే 2006లో సరితాదేవి, జెన్నీ ఆర్‌ఎల్‌, లేఖ పసిడి పతకాల్ని గెలుపొందగా.. నిఖత్‌ జరీన్‌ 2022, 2023లో పసిడి పతకాల్ని సాధించింది. స్వీటీ, నీతు కూడా ఈ ఏడాది గోల్డ్ మెడల్స్ గెలిచారు.

Read Latest Sports News, Cricket News, Telugu News
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.