యాప్నగరం

టార్గెట్ టోక్యో: ఒలింపిక్స్ కోసం స్టీరింగ్ కమిటీ

ఒలింపిక్స్ పతకాల వేటలో ఎప్పుడూ అమెరికా, చైనా దేశాలు ముందుంటాయి. మన దేశంలో క్రీడలకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ క్రికెట్‌కు ఉన్నన్ని మౌలిక సదుపాయాలు అథ్లెటిక్స్‌కు లేవనే చెప్పాలి.

TNN 23 May 2017, 1:54 pm
ఒలింపిక్స్ పతకాల వేటలో ఎప్పుడూ అమెరికా, చైనా దేశాలు ముందుంటాయి. మన దేశంలో క్రీడలకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ క్రికెట్‌కు ఉన్నన్ని మౌలిక సదుపాయాలు అథ్లెటిక్స్‌కు లేవనే చెప్పాలి. దీంతో ఒలింపిక్స్‌కు వెళ్లే అథ్లెట్లకు సరైన శిక్షణ ఇవ్వలేకపోతున్నారు. ఈ కారణాల చేత ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ గేమ్స్‌లో మనం తక్కువ పతకాలకే పరిమితం అవుతున్నాం. అయితే ఇకపై ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల ప్రదర్శనను మెరుగుపరచడానికి, పతకాల సంఖ్య పెంచడానికి క్రీడల శాఖ ఆధ్వర్యంలో ‘ఒలింపిక్ టాస్క్ ఫోర్స్’ను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.
Samayam Telugu olympic task force form empowered committee remove salary cap
టార్గెట్ టోక్యో: ఒలింపిక్స్ కోసం స్టీరింగ్ కమిటీ


ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా, జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఈ టాస్ట్ ఫోర్స్‌లో ఎనిమిది మంది సభ్యులుగా ఉన్నారు. వీరు రాబోయే టోక్యో 2020 ఒలింపిక్స్‌ను లక్ష్యంగా పెట్టుకుని ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఈ టాస్క్ ఫోర్స్ మరో ప్రతిపాదనను తీసుకొచ్చింది. 2020 టోక్యో ఒలింపిక్స్ కోసం అధికారాలతో కూడిన స్టీరింగ్ కమిటీని ఏర్పాటుచేయాలని టాస్క్ ఫోర్స్ సభ్యులు క్రీడల శాఖకు సూచించారు. అలాగే కోచ్‌లకు జీతంపై పరిమితిని కూడా ఎత్తివేసి.. కోచింగ్ స్టాఫ్‌ను ప్రోత్సహించాలన్నారు.

హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్‌ను నియమించి ఆయన సారథ్యంలో ఈ ఎంపవర్డ్ స్టీరింగ్ కమిటీ (ఈఎస్‌సీ) పనిచేయాలని సూచించారు. ఈఎస్‌సీ సహాయంతో మంచి వాతావరణాన్ని కల్పించి, టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు గెలివగలిగే అథ్లెట్లను తయారుచేయాలని వెల్లడించారు. ఈ మేరకు ఒలింపిక్ టాస్క్ ఫోర్స్ సభ్యలు.. క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్‌ను కలిసి తమ ప్రతిపాదనలను వివరించారు.
Was happy to discuss various issues pertaining to preparations of the next three #Olympics with our @OlympicTF members in New Delhi today. pic.twitter.com/hjN2bRznBo — Vijay Goel (@VijayGoelBJP) May 22, 2017
అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న అథ్లెట్లు, వాళ్ల కోచ్‌లకు ‘ప్రధాన మంత్రి గోల్డ్ కార్డ్’ ద్వారా ఫ్లైట్, రైల్, బస్ టిక్కెట్లలో అత్యవసర కోటాను కేటాయించాలని ప్రతిపాదించారు. అలాగే అథ్లెట్ల కోసం 24x7 నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ హెల్ప్‌లైన్ నిర్వహించాలన్నారు. విజయ్ గోయల్‌తో భేటీ అనంతరం పుల్లెల గోపీచంద్ మీడియాతో మాట్లాడారు. ‘మా సమావేశంలో కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చించాం. వీటిలో ప్రధానమైది ఎంపవర్డ్ స్టీరింగ్ కమిటీ. వచ్చే ఒలింపిక్స్ కోసం ఈ స్టీరింగ్ కమిటీని నియమించాలని నిర్ణయించాం’ అని గోపీచంద్ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.