యాప్నగరం

పతకాల సాధనకు ‘జాతీయ స్థాయి అథారిటీ’ తప్పనిసరి

దేశవ్యాప్తంగా వివిధ క్రీడా విభాగాలు, అకాడమీలు, క్రీడలకు సంబంధించిన సమాంతర వ్యవస్థలన్నీ ఏకతాటిపైకి వచ్చినప్పుడే..

TNN 8 Apr 2017, 10:36 pm
ఒలింపిక్స్‌లో భారత్ ఎక్కువ పతకాలు సాధించాలంటే దేశవ్యాప్తంగా వివిధ క్రీడా విభాగాలు, అకాడమీలు, క్రీడలకు సంబంధించిన సమాంతర వ్యవస్థలన్నీ ఏకతాటిపైకి రావాలని ఒలింపిక్ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అన్ని రకాల క్రీడల అభివృద్ధి, పర్యవేక్షణకు జాతీయ స్థాయిలో ఒక అథారిటీ ఉండాలని క్రీడా ప్రముఖులు, నిపుణులు, మీడియా పెద్దలు, ఇతర ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Samayam Telugu olympic task force state level conference different sports bodies should brought under unified authority
పతకాల సాధనకు ‘జాతీయ స్థాయి అథారిటీ’ తప్పనిసరి


2020, 2024, 2028లలో జరిగే ఒలింపిక్ క్రీడల్లో మెరుగైన ప్రదర్శన చేయడానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ప్రధాని మోడీ ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో సమావేశాలు నిర్వహించి ప్రముఖుల అభిప్రాయాలను క్రోడీకరిస్తోంది. ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో హాకీ కోచ్ బల్దేవ్ సింగ్, టైమ్స్ గ్రూప్ ఆన్‌లైన్ చీఫ్ ఎడిటర్ రాజేశ్ కల్రా, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఏపీ స్పోర్ట్స్ సెక్రటరీ ఎల్‌వీ సుబ్రమణ్యం, తెలంగాణ టూరిజం సెక్రెటరీ బుర్రా వెంకటేశం, కరణం మల్లీశ్వరి, గుత్తా జ్వాల తదితరులు పాల్గొని ప్రసంగించారు.

అథ్లెట్లకు సంబంధించిన కీలకాంశాలు, ఆటల సన్నద్ధత, శిక్షణ, కోచ్‌లను గుర్తించడం, క్రీడల ప్రచారంలో వివిధ ఏజెన్సీలను అనుమతించడం, పాలనా సవాళ్లు, నిధుల సమస్యలు తదితర అంశాలపై వీరు పలు సూచనలు చేశారు. క్రీడల్లో రాజకీయ జోక్యాన్ని తగ్గించడానికి చర్యలు చేపట్టాలని, క్రీడలకు సంబంధించిన మౌలిక వసతులను మెరుగుపరచాలని వారు పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలోనూ క్రీడల కోసం కొన్ని మార్పులు చేపట్టాలని, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల కొరతను నివారించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

పిల్లల్లో క్రీడా ప్రతిభను గుర్తించడానికి 8 నుంచి 12 ఏళ్ల వయసు సరైందని, గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఒలింపిక్ పతక గ్రహీత కరణం మల్లీశ్వరి పేర్కొన్నారు. మన దేశంలో చాలా క్రీడలకు సరైన ప్రోత్సాహం లభించడం లేదని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. పవర్ లిఫ్టింగ్ లాంటి క్రీడలు తక్కువ ఖర్చుతో కూడుకున్నవని, గ్రామీణ ప్రాంతాల వారికి ఇలాంటివి తొందరగా చేరువవుతాయని ఆమె అన్నారు.

జాతీయ స్థాయిలో ప్రతిభావంతులకు సరైన సదుపాయాలు కల్పించి అంతర్జాతీయంగా రాణించేలా ప్రొఫెషనల్ శిక్షకుల సూచనలు పొందేలా చర్యలు తీసుకోవాలని టెన్నిస్ ప్లేయర్ గుత్తా జ్వాల సూచించారు. చాలా మంది క్రీడాకారులు సొంతంగా కోచ్‌లను నియమించుకుంటున్నారని, ప్రభుత్వమే వారికి తగిన శిక్షణ ఇప్పిస్తే.. ఆటపై మరింత శ్రద్ధ పెట్టి పైకెదుగుతారని ఆమె అన్నారు.

ప్రధాని మోడీకి ఇచ్చే నివేదికలో ‘జాతీయ స్థాయి అథారిటీ’ అంశాన్నే ప్రముఖంగా ప్రస్తావిస్తానని టాస్క్‌ఫోర్స్ చైర్మన్, స్కూల్ స్పోర్ట్స్ ప్రమోషన్ పౌండేషన్ (ఎస్ఎస్‌పీఎఫ్) సభ్యుడు ఓం పాథక్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.