యాప్నగరం

ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించిన ఒలింపిక్ టాస్క్‌ఫోర్స్

రానున్న ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు మెరుగ్గా రాణించాలంటే ఏం చేయాలో సూచిస్తూ.. ఒలింపిక్ టాస్క్‌ఫోర్స్ ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించింది.

TNN 11 Aug 2017, 7:18 pm
రానున్న మూడు ఒలింపిక్స్‌లో భారత్ మెరుగ్గా రాణించాలంటే ఏ చేయాలో సూచిస్తూ.. ఒలింపిక్ టాస్క్‌ఫోర్స్ ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించింది. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, హాకీ జట్టు మాజీ కెప్టెన్ వీరెన్ రస్కిన్హా కేంద్ర క్రీడల శాఖ కార్యదర్శి ఇంతేజీ శ్రీనివాస్‌కు తమ నివేదికను సమర్పించారు. రియో ఒలింపిక్స్‌ ముగిశాక.. ప్రధాని నరేంద్ర మోదీ 8 మంది సభ్యులతో ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. తీసుకోవాల్సిన ముఖ్య చర్యలు, కార్యనిర్వాహక అంశాలు, మెయిన్ రిపోర్ట్ అని మూడు భాగాలుగా కమిటీ ఈ నివేదికను రూపొందించింది.
Samayam Telugu olympic task force submits final report to government
ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించిన ఒలింపిక్ టాస్క్‌ఫోర్స్


వివిధ క్రీడాంశాల్లో ఏయే సమస్యలు ఎదురవుతున్నాయి, కోచ్‌లు, సదుపాయాలు, ప్రతిభావంతులు అన్వేషణ, విదేశీ కోచ్‌ల ఆవశ్యకత.. ఇలా పలు అంశాలపై టాస్క్‌ఫోర్స్ దృష్టి పెట్టింది. 2020 టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్ గేమ్స్‌లను దృష్టిలో ఉంచుకొని.. దీర్ఘకాలిక లక్ష్యంతో ఒలింపిక్ టాస్క్‌ఫోర్స్ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శుక్రవారం ట్వీట్ చేసింది.

Olympic Task Force (OTF) met Union #Sports Secretary, Sh. Injeti Srinivas, IAS today and submitted it's final report to the Government 1/3 pic.twitter.com/xR0D2dAgCA — SAIMedia (@Media_SAI) August 11, 2017  
ఒలింపిక్స్‌లో మెరుగ్గా రాణించాలంటే ఏం చేయాలనే విషయమై టాస్క్‌ఫోర్స్ భారత్‌లోని ప్రధాన నగరాల్లో అథ్లెట్లు, కోచ్‌లతో పలు దఫాలుగా సమావేశమైంది. ఈ కమిటీ గోపీచంద్, రస్కిన్హాతోపాటు అభినవ్ బింద్రా, ఓం పాఠక్, బలదేవ్ సింగ్, జీఎల్ ఖన్నా, టైమ్స్ గ్రూప్ డిజిటల్ చీఫ్ ఎడిటర్ రాజేశ్ కల్రా, సందీప్ ప్రధాన్ సభ్యులుగా ఉన్నారు.

in "Preparation of 2020 #Tokyo @Olympics & @paralympicgames " keeping in mind the athlete-centric, coach-led and system-driven approach 2/3 pic.twitter.com/RszKxsftNW — SAIMedia (@Media_SAI) August 11, 2017
as it lays the foundation of the Long-Term Athlete Development that is needed for #India to win beyond #Tokyo. #Tokyo2020 #SAI 3/3 🇮🇳 — SAIMedia (@Media_SAI) August 11, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.