యాప్నగరం

ఇండోనేసియా మాస్టర్స్ నుంచి సైనా నెహ్వాల్ ఔట్.. సింధు శుభారంభం

ఇండోనేసియా మాస్టర్స్‌ నుంచి ఒకే రోజు నలుగురు భారత షట్లర్లు నిష్క్రమించారు. గత ఏడాది టోర్నీ విజేతగా నిలిచిన సైనా తొలి రౌండ్‌లోనే ఓడిపోయి ఇంటిబాట పట్టింది.

Samayam Telugu 15 Jan 2020, 7:41 pm
ఇండోనేసియా మాస్టర్స్‌లో భారత్‌కి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తొలి మ్యాచ్‌లోనే ఓడిపోగా.. భారీ అంచనాల మధ్య టోర్నీలోకి అడుగుపెట్టిన సాయి ప్రణీత్, కిదాంబి శ్రీకాంత్, సౌరభ్ వర్మలు కూడా పేలవ ఓటములతో ఇంటిబాట పట్టారు. పీవీ సింధు మాత్రమే విజయంతో రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.
Samayam Telugu Basel: Indias Saina Nehwal returns a shuttlecock to Denmarks Mia Blichfeldt du...


మహిళల సింగిల్స్‌లో భాగంగా జపాన్ షట్లర్ అయా ఒహోరీతో ఈరోజు తలపడిన పీవీ సింధు 14-21, 21-15, 21-11 తేడాతో విజయాన్ని అందుకుంది. ఒహోరీతో ఇప్పటి వరకూ 10 సార్లు తలపడిన సింధు.. అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలుపొందడం విశేషం. ఇటీవల ముగిసిన మలేసియా మాస్టర్స్‌లో సింధు, సైనా నెహ్వాల్ క్వార్టర్ట్స్‌లో వెనుదిరిగిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో.. లయ అందుకోవాలని ఆశించిన సైనా నెహ్వాల్‌కి మరోసారి నిరాశ ఎదురైంది. గత ఏడాది నుంచి టైటిల్ వేటలో బాగా వెనకబడిపోయిన సైనా.. ఈరోజు జపాన్ షట్లర్ సయక చేతిలో 21-19 13-21 5-21 తేడాతో ఓడిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.