యాప్నగరం

కొరియా ఓపెన్: సెమీస్‌కు చేరిన పీవీ సింధు

భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు.. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో సెమీ ఫైనల్‌కు చేరింది.

TNN 15 Sep 2017, 4:58 pm
భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు.. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో సెమీ ఫైనల్‌కు చేరింది. కిందటి నెల వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో సిల్వర్ గెలిచి ప్రస్తుతం కొరియా ఓపెన్‌లో ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు.. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్‌ క్రీడాకారిణి మితాని మినత్సుతో తలపడింది. 63 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో 21-19, 16-21, 21-10తో సింధు విజయం సాధించింది. దీంతో సెమీస్‌కి దూసుకెళ్లింది. సెమీ ఫైనల్లో మూడో సీడ్ సుంగ్ జి హ్యూన్ (సౌత్ కొరియా)తో గానీ, చైనాకు చెందిన హి బింగ్జివోతో గానీ సింధు తలపడే అవకాశముంది.
Samayam Telugu pv sindhu enter korea open super series semi final
కొరియా ఓపెన్: సెమీస్‌కు చేరిన పీవీ సింధు


మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారుడు సమీర్ వర్మ ఇంటిదారి పట్టాడు. క్వార్టర్ ఫైనల్‌లో 22-20, 10-21, 13-21తో టాప్‌ సీడ్‌ సన్‌వాన్‌(దక్షిణ కొరియా) చేతిలో సమీర్ ఓడిపోయాడు. తొలి గేమ్‌లో గట్టి పోటీ ఇచ్చిన సమీర్.. తరవాత రెండు గేమ్లలో చేతులెత్తేశాడు. మొత్తం 1 గంట 9 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.