యాప్నగరం

పీవీ సింధు... మూడేళ్లకు రూ.50 కోట్ల డీల్

రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో రజత పతకం గెలిచి భారత్ సత్తాని ప్రపంచానికి చాటింది తెలుగమ్మాయి పీవీ సింధు. 

TNN 27 Sep 2016, 12:46 pm
రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో రజత పతకం గెలిచి భారత్ సత్తాని ప్రపంచానికి చాటింది తెలుగమ్మాయి పీవీ సింధు. ఆ విజయం ఆమెపై కనక వర్షాన్ని కురిపించింది. పదిహేను కోట్ల రూపాయల దాకా నగదుని బహుమానాల రూపంలో అందించింది. ఇప్పుడు సింధు మరో ఘనత కూడా సాధించింది. క్రికెట్ ప్లేయర్లనే ఎక్కువ సంస్థలు అండాసిడర్ గా పెట్టుకుని కోట్లలో పారితోషికాన్ని ముట్టజెపుతాయి. పీవీ సింధుకు వాళ్లతో సమానమైన పారితోషికాన్ని అందిస్తూ డీల్ కుదుర్చుకుంది స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ కంపెనీ బేస్ లైన్. నాన్ క్రికెట్ ప్లేయర్ కి ఇంత మొత్తంలో డీల్ కుదరడం ఇదే మొదటిసారి. ఆమెతో బేస్ లైన్ సంస్థ మూడేళ్ల కాలానికి డీల్ కుదుర్చుకుంది. ఈ మూడేళ్లలో సింధు చేసే ప్రకటనలు, ఎండార్స్ మెంట్‌లు, ఏఏ బ్రాండ్లకు ప్రచారం చేయాలి అన్నీ ఆ సంస్థే చూసుకుంటుంది. ఇందుకు సింధుకు రూ.50కోట్ల వరకు పారితోషికం అందుతుంది. బేస్‌లైన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తుహిన్ మిశ్రా మాట్లాడుతూ సింధు ప్రకటనల కోసం చాలా తక్కువ సమయం కేటాయిస్తుందని, ఆమె ఆట ప్రాక్టీసుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకుంటామని చెప్పారు. ఇప్పటికే చాలా ఉత్పత్తుల సింధుతో ప్రకటనల కోసం సంప్రదించారని, వాటిల్లో 9 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. గోపీచంద్ లాగే సింధు కూడా కూల్ డ్రింక్ లు, యువతను తీవ్రంగా ప్రభావితం చేసే ఉత్పత్తులు చేయదని తెలిపారు. మహిళల కోసం తయారుచేసిన ఉత్పత్తులు, ఆర్థిక సంస్థల కోసం ప్రకటనలు చేయబోతోందని చెప్పారు.
Samayam Telugu pv sindhu has signed a three year deal worth up tp rs 50 crore with baseline company
పీవీ సింధు... మూడేళ్లకు రూ.50 కోట్ల డీల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.