హాంగ్ కాంగ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు మరోసారి ఓటమి పాలైంది. గత ఏడాది హాంగ్ కాంగ్ ఓపెన్ ఫైనల్లో చైనీస్ తైపీ ప్లేయర్ తై జు యింగ్ చేతిలో ఓడిన సింధు.. ఈ ఏడాది కూడా ఆమె చేతిలోనే పరాజయం చవి చూసింది. ఆదివారం జరిగిన ఫైనల్లో వరల్డ్ నంబర్ 1 షట్లర్ తై జు యింగ్ చేతిలో 18-21, 17-21 తేడాతో వరుస గేముల్లో సింధు ఓడింది. తొలి గేమ్ నుంచే ఆధిక్యం కనబర్చిన తై జు సింధుపై ఆధిపత్యం చెలాయించింది.
మొదటి గేమ్లో వరుసగా నాలుగు పాయింట్లు సాధించిన సింధు 18-18తో సమం చేసినప్పటికీ.. తర్వాత పుంజుకోలేకపోయింది. దీంతో 18-21 తేడాతో తొలి గేమ్ను కోల్పోయింది. రెండో గేమ్లోనూ సింధు పోరాడినప్పటికీ.. నిరాశే ఎదురుదైంది. రెండో గేమ్లో ఓ దశలో సింధు 11-9తో ఆధిక్యం కనబర్చింది. కానీ పుంజుకున్న చైనీస్ తైపీ ప్లేయర్ 21-17 తేడాతో సింధుపై గెలుపొందింది.
సెమీఫైనల్లో తనకంటే మెరుగైన రికార్డు ఉన్న రచనోక్పై గెలిచిన సింధు.. ఫైనల్లోనూ గెలుపొందితే హాంగ్ కాంగ్ ఓపెన్ నెగ్గిన మూడో భారత షట్లర్గా నిలిచేది. ఇప్పటి వరకూ ప్రకాశ్ పదుకొనే, సైనా నెహ్వాల్ మాత్రమే హాంగ్ కాంగ్ ఓపెన్ గెలిచారు. వరుసగా రెండోసారి ఫైనల్ చేరినప్పటికీ.. సింధు టైటిల్ను మాత్రం నెగ్గలేకపోయింది.
మొదటి గేమ్లో వరుసగా నాలుగు పాయింట్లు సాధించిన సింధు 18-18తో సమం చేసినప్పటికీ.. తర్వాత పుంజుకోలేకపోయింది. దీంతో 18-21 తేడాతో తొలి గేమ్ను కోల్పోయింది. రెండో గేమ్లోనూ సింధు పోరాడినప్పటికీ.. నిరాశే ఎదురుదైంది. రెండో గేమ్లో ఓ దశలో సింధు 11-9తో ఆధిక్యం కనబర్చింది. కానీ పుంజుకున్న చైనీస్ తైపీ ప్లేయర్ 21-17 తేడాతో సింధుపై గెలుపొందింది.
సెమీఫైనల్లో తనకంటే మెరుగైన రికార్డు ఉన్న రచనోక్పై గెలిచిన సింధు.. ఫైనల్లోనూ గెలుపొందితే హాంగ్ కాంగ్ ఓపెన్ నెగ్గిన మూడో భారత షట్లర్గా నిలిచేది. ఇప్పటి వరకూ ప్రకాశ్ పదుకొనే, సైనా నెహ్వాల్ మాత్రమే హాంగ్ కాంగ్ ఓపెన్ గెలిచారు. వరుసగా రెండోసారి ఫైనల్ చేరినప్పటికీ.. సింధు టైటిల్ను మాత్రం నెగ్గలేకపోయింది.