యాప్నగరం

ఆల్ ఇంగ్లాండ్ టోర్ని నుంచి సింధు, సైనా ఔట్

ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఛాంపియన్‌షిప్స్ నుంచి ఒలంపిక్ మెడల్స్ విజేతలు పీవీ సింధు, సైనా నేహ్వాల్ నిష్క్రమించారు.

TNN 11 Mar 2017, 1:28 am
ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఛాంపియన్‌షిప్స్ నుంచి ఒలంపిక్ మెడల్స్ విజేతలు పీవీ సింధు, సైనా నేహ్వాల్ నిష్క్రమించారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచెస్‌లో ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారిణి తై జు యింగ్ (చైనా) చేతిలో సింధు ఓటమిపాలు కాగా తన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కొరియా క్రీడాకారిణి సుంగ్ జి హ్యున్ చేతిలో సైనా నేహ్వాల్ ఓడిపోయారు.
Samayam Telugu pv sindhu saina nehwal out from all england open championships
ఆల్ ఇంగ్లాండ్ టోర్ని నుంచి సింధు, సైనా ఔట్


వరుసగా మ్యాచ్‌లు కోల్పోయిన పీవీ సింధు కేవలం 34 నిమిషాల వ్యవధిలోనే 14-21, 10-21 పాయింట్లో చైనీస్ షట్లర్ చేతిలో ఓటమిచెందగా ప్రపంచ 3వ ర్యాంక్ క్రీడాకారిణి హ్యున్‌తో సైనా నేహ్వాల్ చివరి వరకు పోరాడి ఓడారు. 53 నిమిషాలపాటు సాగిన సైనా-హ్యున్ పోరులో 20-22, 20-22 పాయింట్ల స్వల్ప తేడాతో ఈ టోర్ని నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ ఇద్దరి నిష్క్రమణతో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఛాంపియస్‌షిప్ పోటీల్లో భారత్ ప్రస్థానం ముగిసినట్లయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.