యాప్నగరం

చైనా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన సింధు

చైనా ఓపెన్ సూపర్ సిరీస్‌లో తెలుగు తేజం పీవీ సింధు క్వార్టర్ ఫైనల్ చేరింది. మిగతా వాళ్లంతా వెనక్కి మళ్లినా సింధు పోరాడింది.

TNN 16 Nov 2017, 5:16 pm
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చైనా ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో క్వార్టర్ ఫైనల్ చేరింది. 21-15, 21-13 తేడాతో చైనా యువ క్రీడాకారిణి హన్ యుయిపై విజయం సాధించింది. 17 ఏళ్ల హన్ సింధుతో తలపడటం ఇదే తొలిసారి కాగా, ఓ దశలో 5-6తో ముందజ వేసింది. కానీ అనుభవాన్ని ఉపయోగించిన సింధు.. పుంజుకొని ఆధిపత్యం చెలాయించింది. ఈ మ్యాచ్‌లో సింధు తప్పిదాలు చేసినప్పటికీ.. కీలక తరుణంలో చక్కటి ఆట తీరు కనబరిచి ముందడుగేసింది.
Samayam Telugu pv sindhu sole indian shuttler in china open quarterfinals
చైనా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన సింధు


చైనా ఓపెన్ నుంచి ఇప్పటికే హెచ్ఎస్ ప్రణయ్, సైనా నెహ్వాల్ నిష్క్రమించగా.. సింధు మాత్రమే క్వార్టర్ ఫైనల్ చేరింది. గత వారం జరిగిన జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌‌షిప్‌లో వీరిద్దరూ విజేతలుగా నిలిచిన సంగతి తెలిసిందే.

పురుషుల బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో ఉన్న ప్రణయ్.. చైనాకు చెందిన 53వ ర్యాంకర్ చెవ్‌క్ యీ లీ చేతిలో 21-19, 21-17 తేడాతో పరాజయం పాలయ్యాడు. 11వ ర్యాంక్‌లో కొనసాగుతున్న సైనా.. వరల్డ్ నంబర్ 3 అకానే యమగుచి చేతిలో 21-18, 21-11 తేడాతో వరుస సెట్లలో ఓడింది. జపాన్‌కు చెందిన యమగుచి చేతిలో సైనా ఓడటం ఈ ఏడాది ఇది నాలుగోసారి కావడం గమనార్హం. గాయం కారణంగా ఈ టోర్నీకి కిడాంబి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.