యాప్నగరం

గ్రూప్-1 ఆఫీసర్‌గా సింధు నియామకం..!

గత ఏడాది ముగిసిన రియో ఒలింపిక్స్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సింధు ఫైనల్‌కి చేరింది. అక్కడ

TNN 27 Jul 2017, 5:26 pm
రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన పి.వి.సింధు గ్రూప్‌-1 ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియామక పత్రాన్ని గురువారం పి.వి.సింధుకి అందజేశారు. దేశం గర్వించేలా మరిన్ని పతకాలు సింధు సాధించాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
Samayam Telugu pvsindhu an appointment order for the post of group 1 officer
గ్రూప్-1 ఆఫీసర్‌గా సింధు నియామకం..!


గత ఏడాది ముగిసిన రియో ఒలింపిక్స్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సింధు ఫైనల్‌కి చేరింది. అక్కడ కరోలినా మారిన్ చేతిలో ఓడినా.. బ్యాడ్మింటన్‌లో రజతం గెలిచిన ఏకైక క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. ఒలింపిక్స్‌లో సింధు పోరాట పటిమకి మెచ్చిన చంద్రబాబు నాయుడు అప్పట్లో సింధుకి గ్రూప్-1 ఆఫీసర్‌ ఉద్యోగాన్ని ప్రకటించారు. తాజాగా దానికి సంబంధించిన నియామక పత్రాన్ని ఆమెకి స్వయంగా అందజేశారు.

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu gives PV Sindhu an appointment order for the post of Group-1 Officer. On May 16, 2017 The Andhra Pradesh Legislature passed a Bill to appoint Olympics silver medallist P V Sindhu as a Group-1 officer in the government, by amending the State Public Services Act.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.