భారత్లో దశాబ్దాల కాలంగా ఆట అంటే క్రికెట్గా ఉండిపోయింది. కానీ.. గత ఏడాది ముగిసిన రియో ఒలింపిక్స్లో పి.వి.సింధు అసమాన ప్రదర్శన చూసిన తర్వాత క్రమంగా క్రీడా అభిమానుల్లో మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం క్రికెట్ తర్వాత బ్యాడ్మింటన్, కబడ్డీ, హాకీ పోటీలను కూడా ఆదరిస్తున్నారు. దీంతో క్రీడాకారుల్లో ఉత్సాహం రెట్టింపై మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత కొంతకాలంగా దేశంలో బ్యాడ్మింటన్కి క్రేజ్ను సైనా నెహ్వాల్, సింధు తీసుకురాగా.. దాన్ని శిఖరాగ్రస్థాయికి యువ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ తాజాగా తీసుకెళ్లాడు.
బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ శిక్షణలో రాటుదేలిన శ్రీకాంత్ ఇటీవల వరుస సూపర్ సిరీస్ల్లో సత్తా చాటి అందర్నీ ఆకర్షించాడు. 2014లో అద్భుతమైన ఆటతో తొలిసారి వెలుగులోకి వచ్చిన శ్రీకాంత్.. ఆరంభంలోనే బ్యాడ్మింటన్ దిగ్గజం, చైనా షట్లర్ లిన్డాన్ని ఓడించి ఔరా అనిపించాడు. అనంతరం ఫామ్ కోల్పోవడం, గాయాల బారిన పడటంతో కెరీర్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న శ్రీకాంత్ మరోసారి బ్యాడ్మింటన్లో తన ఆగమనం ఘనంగా చాటాడు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఇండోనేసియా, ఆస్ట్రేలియా ఓపెన్ సిరీస్ టైటిల్స్ గెలిచి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.
ఇటీవల కాలంలో శ్రీకాంత్తో పాటు ప్రణయ్, సాయి ప్రణీత్ మెరుగైన ఆటతో ఓపెన్ సిరీస్ల్లో సత్తా చాటారు. ఈ యువ షట్లర్ల ఆటలో వేగం, ఫిటెనెస్, క్రమశిక్షణ చూస్తుంటే అతి తక్కువ కాలంలోనే చైనాకి దీటుగా భారత్ పతకాల పంట పండుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ప్రకాశ్ పదుకొణె, పుల్లెల గోపీచంద్ కెరీర్ ముగిసిన తర్వాత మధ్యలో కశ్యప్ కొన్ని రోజులు ఈ పురుషుల బ్యాడ్మింటన్ బాధ్యతని మోశాడు. తాజాగా ముగ్గురు యువ షట్లరు ఫామ్లోకి వచ్చి బ్యాడ్మింటన్ ప్రపంచానికి సవాల్ విసురుతున్నారు.
బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ శిక్షణలో రాటుదేలిన శ్రీకాంత్ ఇటీవల వరుస సూపర్ సిరీస్ల్లో సత్తా చాటి అందర్నీ ఆకర్షించాడు. 2014లో అద్భుతమైన ఆటతో తొలిసారి వెలుగులోకి వచ్చిన శ్రీకాంత్.. ఆరంభంలోనే బ్యాడ్మింటన్ దిగ్గజం, చైనా షట్లర్ లిన్డాన్ని ఓడించి ఔరా అనిపించాడు. అనంతరం ఫామ్ కోల్పోవడం, గాయాల బారిన పడటంతో కెరీర్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న శ్రీకాంత్ మరోసారి బ్యాడ్మింటన్లో తన ఆగమనం ఘనంగా చాటాడు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఇండోనేసియా, ఆస్ట్రేలియా ఓపెన్ సిరీస్ టైటిల్స్ గెలిచి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.
ఇటీవల కాలంలో శ్రీకాంత్తో పాటు ప్రణయ్, సాయి ప్రణీత్ మెరుగైన ఆటతో ఓపెన్ సిరీస్ల్లో సత్తా చాటారు. ఈ యువ షట్లర్ల ఆటలో వేగం, ఫిటెనెస్, క్రమశిక్షణ చూస్తుంటే అతి తక్కువ కాలంలోనే చైనాకి దీటుగా భారత్ పతకాల పంట పండుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ప్రకాశ్ పదుకొణె, పుల్లెల గోపీచంద్ కెరీర్ ముగిసిన తర్వాత మధ్యలో కశ్యప్ కొన్ని రోజులు ఈ పురుషుల బ్యాడ్మింటన్ బాధ్యతని మోశాడు. తాజాగా ముగ్గురు యువ షట్లరు ఫామ్లోకి వచ్చి బ్యాడ్మింటన్ ప్రపంచానికి సవాల్ విసురుతున్నారు.