యాప్నగరం

డెన్మార్క్ ఓపెన్: ఆరేళ్ల తర్వాత ఫైనల్‌ చేరిన సైనా

భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ డెన్మార్క్ ఓపెన్లో అద్భుత ఆటతీరు కనబరుస్తోంది. వరుస విజయాలతో ఆమె ఫైనల్ చేరింది.

Samayam Telugu 21 Oct 2018, 7:49 am
డెన్మార్క్ ఓపెన్లో సైనా నెహ్వాల్ జైత్రయాత్ర కొనసాగుతోంది. టోర్నీ ఆరంభం నుంచి అద్భుత ఆటతీరు కనబరుస్తోన్న సైనా.. మహిళల సింగిల్స్ ఫైనల్ చేరింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో ఇండోనేసియాకు చెందిన గ్రెగోరియా మరిస్కా టుంజుంగ్‌ను 21-11, 21-12 తేడాతో ఓడించింది. 2012లో డెన్మార్క్ ఓపెన్ చేరిన సైనా.. ఆరేళ్ల తర్వాత రెండోసారి ఫైనల్ చేరింది. ఫైనల్లో చైనీస్ తైపీ ప్లేయర్ తై జు యింగ్‌తో తలపడనుంది.
Samayam Telugu saina1


బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్న సైనా.. సెమీస్‌లో దూకుడు కనబర్చింది. ఆరంభంలోనే 4-1 తేడాతో ఆధిక్యంలో దూసుకెళ్లిన ఆమె.. 11-5తో భారీ ఆధిక్యం సంపాదించింది. 21-11 తేడాతో తొలి గేమ్‌ను గెలుపొందిన సైనా.. అదే ఊపులో రెండో గేమ్‌ను కూడా సొంతం చేసుకుని ఫైనల్ చేరింది.

అంతకు ముందు జపాన్ ప్లేయర్ మొమోటాతో జరిగిన పురుషు సింగిల్స్ సెమీఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ ఓటమిపాలయ్యాడు. ఆరంభం నుంచే ఆధిపత్యం కనబర్చిన మొమోటా.. 21-16, 21-12 తేడాతో శ్రీకాంత్‌ను ఓడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.