యాప్నగరం

Hyderabadi ప్లేయర్ సానియా మీర్జా రీఎంట్రీ అదుర్స్

దాదాపు రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ టెన్నిస్ లోకి పునరాగమనం చేసిన హైదరాబాదీ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా శుభారంభం చేసింది. హోబర్ట్ టోర్నీలో క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.

Samayam Telugu 14 Jan 2020, 4:03 pm
భారత ఏస్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పునరాగనమం అద్భుతంగా జరిగింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీ మహిళల డబుల్స్‌లో శుభారంభం చేసింది. ఉక్రెయిన్ పార్ట్‌నర్ నాదియ కిచినోక్‌తో కలిసి మంగళవారం బరిలోకి దిగిన ఈ హైదరాబాదీ స్టార్ 2-6, 7-6, 10-3తో ఒసాన కలష్నికోవా-మియు కాటోపై అద్భుత విజయం సాధించింది. గంటా 41 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో తొలిసెట్ కోల్పోయిన సానియా జోడీ.. తర్వాతి రెండు సెట్లలో అద్భుత పోరాటం చేసి విజయం సాధించింది.
Samayam Telugu sania mirza

Read Also : రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుంటే టీవీకి అతుక్కుపోతాను

2017 చైనా ఓపెన్ తర్వాత ఆట నుంచి విరామం తీసుకుని కొడుకుకు జన్మనిచ్చింది. అనంతరం సానియా మంగళవారం తాజాగా బరిలోకి దిగింది. విజయం సాధించిన అనంతరం ట్విట్టర్‌లో తన కుమారునికి హైఫై ఇస్తున్న పిక్‌ను పోస్టు చేసింది. ఈ మ్యాచ్‌కు సానియా తల్లిదండ్రులు హాజరయ్యారు. బుధవారం జరిగే క్వార్టర్స్‌లో వానియా కింగ్-క్రిస్టీనా మెక్‌హాలే జంటతో సానియా జోడీ తలపడనుంది.

Read Also : Baby Sitter మళ్లీ తెరపైకి..! IND vs AUS సిరీస్‌లో రిషబ్ పంత్ ఊరుకుంటాడా..?
మరోవైపు సానియా ప్రతిష్టాత్మక ఫెడ్‌కప్‌కు కూడా ఎంపికైంది. 2016లో చివరిసారి భారత్ తరపున ఆమె ఈ టోర్నీ ఆడింది. మహిళలకు డబుల్స్‌కు సంబంధించి సానియా అగ్రశ్రేణి ప్లేయర్‌గా ఎదిగింది. ఆమె కెరీర్‌లో మూడు మహిళల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. అలాగే మూడు మిక్స్‌డ్ డబుల్స్ టైటిళ్లను కూడా సాధించింది.

Read Also : ఈరోజే IND vs AUS 1st ODI.. ఆసీస్‌ రికార్డ్స్‌తో భారత్‌లో గుబులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.