యాప్నగరం

ఫ్రెంచ్ ఓపెన్‌లో సాయి- చిరాగ్ జోడికి రజతం

ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత్ పోరాటం ముగిసింది. సింగిల్స్‌లో పోటీపడిన అగ్రశ్రేణి షట్లర్లందరూ క్వార్టర్స్‌లోపే వెనుదిరగగా.. అంచనాల్లేని సాయిరాజ్ -చిరాగ్ జోడీ ఫైనల్లో ఓడి రజత పతకంతో సరిపెట్టింది.

Samayam Telugu 28 Oct 2019, 9:55 am
పారిస్ వేదికగా జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత్‌కి కొద్దిలో పసిడి పతకం చేజారింది. టోర్నీ పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కి చేరిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ.. పసిడి పోరులో ఇండోనేషియాకి చెందిన మార్కస్, కెవిన్ జోడీ చేతిలో వరుస సెట్లలో పరాజయాన్ని చవిచూసింది. అయినప్పటికీ.. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కి చేరిన రెండో జోడీ‌గా సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అరుదైన ఘనత సాధించారు. 1983లో తొలిసారి పార్థో గంగూలీ, విక్రమ్ సింగ్ జోడీ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచింది.
Samayam Telugu Satwiksairaj Rankireddy,Chirag Shetty
Satwiksairaj Rankireddy (left) and Chirag Shetty (© BWF Media)


Read More:undefined
ఇండోనేషియా షట్లర్‌ జోడీపై 0-6 ఓటమి రికార్డ్‌తో ఫైనల్లో ఢీకొట్టిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ ఆశించిన మేర సత్తాచాటలేకపోయింది. 121 వారాలుగా డబుల్స్‌లో నెం.1 జోడీగా కొనసాగుతున్న మార్కస్, కెవిన్ అలవోకగా 21-18, 21-16 తేడాతో భారత్ జోడీని ఓడించేశారు.

సింగిల్స్‌లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన పీవీ సింధు, సైనా నెహ్వాల్‌తో పాటు భారత షట్లర్లు అందరూ క్వార్టర్స్‌లోపే వెనుదిరిగారు. కానీ.. ఏమాత్రం అంచనాల్లేని సాత్విక్ జోడీ ఏకంగా ఫైనల్‌కి చేరి భారత్‌ పరువు నిలిపింది. 2017లో పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ విజేతగా నిలవగా.. 2012లో సైనా నెహ్వాల్‌ ఫైనల్లో ఆడింది. ఫ్రెంచ్ ఓపెన్‌ సింగిల్స్‌లో ఇప్పటి వరకూ భారత్ అత్యుత్తమ ప్రదర్శన ఇవే..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.