బాలీవుడ్ ఐటెంబాంబ్ సన్నీలియోన్ గురువారం ముంబైలో జరిగిన ప్రోకబడ్డీ మ్యాచ్ కు హాజరైంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయగీతం 'జనగణమన'ను సన్నీలియోన్ ఆలపించింది. అయితే జాతీయగీతాన్ని అవమానించారు అంటూ సన్నీపై ఢిల్లీలోని ఆశోక్ నగర్ పోలీస్ స్టేషన్ లో కొంతమంది ఫిర్యాదు చేశారు. సన్నీకి జనగణమన సరిగా పలకడం రాలేదని అందులోని పదాల నుంచి ఆలపించే రాగం వరకూ అంత తప్పుగా పాడిందని ఈ రకంగా జాతీయగీతాన్ని అవమానం జరిగిందంటూ ఫిర్యాదు చేశారు. సన్నీలియోన్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, జాతీయగీతం పాడిన అనంతరం సన్నీలియోన్ గర్వంగా ఫీలయింది. తనకిలాంటి అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని సన్నీ పేర్కొంది. ప్రోకబడ్డీ గురించి మాట్లాడుతూ తనకూ కబడ్డీ ఆట అంటే చాలా ఇష్టమని, చిన్నపుడు తన తండ్రి కూడా తనను కబడ్డీ ఆడేలా ప్రోత్సహించారని సన్నీ తెలిపింది.
సన్నీ లియోన్ 'జనగణమన' పై ఫిర్యాదు
సన్నీలియోన్ గురువారం ముంబైలో జరిగిన ప్రోకబడ్డీ మ్యాచ్ కు హాజరైంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయగీతం 'జనగణమన'ను సన్నీలియోన్ ఆలపించింది...
TNN 22 Jul 2016, 7:05 pm