యాప్నగరం

థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో కిదాంబి శ్రీకాంత్ బోణి.. వరుస సెట్లలో గెలుపు

థాయ్‌లాండ్ ఓపెన్ నిర్వాహకులపై మంగళవారం ఘాటు విమర్శలు గుప్పించిన కిదాంబి శ్రీకాంత్.. బుధవారం అదే జోరుని మ్యాచ్‌లో చూపాడు. దాంతో.. వరుస సెట్లలో అతను గెలవగా.. ప్రత్యర్థికి ఏమాత్రం పుంజుకునే అవకాశం లభించలేదు.

Samayam Telugu 13 Jan 2021, 6:08 pm
బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ బోణి కొట్టాడు. పురుషుల సింగిల్స్‌లో భాగంగా భారత్‌కే చెందిన సౌరభ్ వర్మతో బుధవారం తొలి మ్యాచ్‌లో ఢీకొట్టిన కిదాంబి శ్రీకాంత్ 21-12, 21-11 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి సౌరభ్‌పై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించిన శ్రీకాంత్.. కేవలం 31 నిమిషాల్లోనే గేమ్‌ని ముగించడం విశేషం.
Samayam Telugu Kidambi Srikanth
Kidambi Srikanth. (Getty Images)


వాస్తవానికి టోర్నీ ఆరంభానికి ముందు కిదాంబి శ్రీకాంత్ గాయపడ్డాడు. కరోనా వైరస్ పరీక్షల కోసం అతని నుంచి వైద్య సిబ్బంది నమూనాల్ని సేకరించే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. శ్రీకాంత్ ముక్కుకి గాయమైంది. మంగళవారం తన ముక్కులో నుంచి రక్తం కారుతున్న ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శ్రీకాంత్.. టోర్నీ నిర్వాహకుల తీరుపై విమర్శలు గుప్పించాడు. దాంతో.. శ్రీకాంత్ గాయంపై నివేదిక ఇవ్వాల్సిందిగా థాయ్‌లాండ్ ఓపెన్ నిర్వాహకుల్ని బీడబ్ల్యూఎఫ్ ఆదేశించింది.

థాయ్‌లాండ్ ఓపెన్‌లోకి భారీ అంచనాల నడుమ అడుగుపెట్టిన పీవీ సింధు తొలి రౌండ్‌లోనే ఓడిపోగా.. సాయి ప్రణీత్‌కి కూడా నిరాశే ఎదురైంది. దాంతో.. కిదాంబి శ్రీకాంత్‌ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలి సెట్‌లో వరుసగా 9 పాయింట్లు సాధించిన కిదాంబి శ్రీకాంత్.. రెండో సెట్‌లో వరుసగా 10 పాయింట్లు సాధించాడు. దాంతో.. సౌరవ్ వర్మకి పుంజుకునే అవకాశమే లభించలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.