యాప్నగరం

తృటిలో స్వ‌ర్ణం చేజార్చుకోవ‌డం బాధే..!

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో తృటిలో స్వర్ణాన్ని చేజార్చుకోవడం తనకి బాధ కలిగించిందని భారత బ్యాడ్మింటన్ స్టార్

TNN 29 Aug 2017, 1:31 pm
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో తృటిలో స్వర్ణాన్ని చేజార్చుకోవడం తనకి బాధ కలిగించిందని భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు వెల్లడించింది. ఆదివారం ముగిసిన ఈ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి నొజొమి ఒకుహర చేతిలో 19-21, 22-20, 20-22 తేడాతో సింధు ఓటమి చవిచూసింది. సుమారు గంటా 50 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో చివరి వరకూ సింధూ పోరాడినా.. మరోసారి రజతానికే పరిమితం కావాల్సి వచ్చింది. గత ఏడాది రియో ఒలింపిక్స్ ఫైనల్లోనూ సింధు స్వర్ణాన్ని తృటిలో చేజార్చుకుని రజతంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. రెండు సార్లు ఇలా కొద్దిలో బంగారు పతకం చేజారడంపై సింధు తాజాగా మాట్లాడింది.
Samayam Telugu there is always this feeling of missing out on gold pv sindhu
తృటిలో స్వ‌ర్ణం చేజార్చుకోవ‌డం బాధే..!


‘ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం చేజార్చుకోవడం‌తో కొంచెం కలత చెందాను. అయితే ఫైనల్‌కి చేరిన తర్వాత ఇద్దరు క్రీడాకారిణులు పోరాడేది బంగారు పతకం కోసమే కదా..? మొదటి సెట్‌ చేజారగానే కొంచెం నిరాశచెందాను. ఎందుకంటే ఆట మొత్తం సుదీర్ఘ ర్యాలీలతో కొనసాగుతోంది. కాబట్టి ఇక్కడ ప్రతి పాయింట్ కీలకమే. అందుకే ఇద్దరం ఎక్కడా ఉదాసీనత కనబర్చలేదు. కానీ.. మూడో సెట్‌లో‌కి వచ్చేసరికి 20-20తో పోరు ఉత్కంఠగా మారిపోయింది. చివరి నిమిషంలో నాకు కలిసిరాలేదు. అయితే.. రజతంతో నేను హ్యాపీనే కానీ.. స్వర్ణం గెలవలేకపోయానే అనే బాధ మాత్రం అలాగే ఉండిపోయింది’ అని సింధు వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.