భారత సీనియర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ నేషనల్ క్యాంప్నకి దూరంగా ఉంటోంది. హైదరాబాద్లోని గోపీచంద్ అకాడమీలో 8 మంది ఒలింపిక్ ఆశావహులతో ఈ నెల 7 నుంచి క్యాంప్ని ఏర్పాటు చేసుకునేందుకు భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) అనుమతి ఇవ్వగా... ఆ జాబితాలో సైనా భర్త పారుపల్లి కశ్యప్కి చోటు దక్కలేదు. దాంతో.. అసంతృప్తి వ్యక్తం చేసిన కశ్యప్.. సాయ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. కశ్యప్కి ఆ క్యాంప్లో చోటు దక్కకపోవడంతో.. లిస్ట్లో తన పేరు ఉన్నా సైనా నెహ్వాల్ మాత్రం ఆ క్యాంప్నకి ఇప్పటి వరకూ హాజరవలేదు.
వాస్తవానికి క్యాంప్నకి 8 మంది ఆటగాళ్లు ఎంపికైనా.. ఇప్పటి వరకూ హాజరైంది పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్, సిక్కిరెడ్డి మాత్రమే. మిగిలిన నలుగురిలో సాత్విక్, చిరాగ్ మరో వారంలో ఆ క్యాంప్నకి హాజరుకానున్నట్లు వార్తలు వస్తుండగా.. అశ్విని బెంగళూరులో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్.. హైదరాబాద్లోని గోపీచంద్ అకాడమీకి కొద్ది దూరంలో ఉన్న బ్యాడ్మింటన్ కోర్టులో గత కొన్ని రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
నేషనల్ క్యాంప్నకి ఆటగాళ్ల ఎంపికపై పారదర్శకతని ప్రశ్నిస్తూ.. ఇటీవల సాయ్తో పాటు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)లకి కూడా పారుపల్లి కశ్యప్ లేఖ రాశాడు. కానీ.. ఈ రెండు అసోషియేషనల్ల నుంచి అతనికి సంతృప్తికర సమాధానం లభించినట్లు లేదు. దాంతో.. సైనా నెహ్వాల్ కూడా సాయ్, బాయ్ల తీరుపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వచ్చే ఏడాదికి వాయిదాపడిన విషయం తెలిసిందే.
వాస్తవానికి క్యాంప్నకి 8 మంది ఆటగాళ్లు ఎంపికైనా.. ఇప్పటి వరకూ హాజరైంది పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్, సిక్కిరెడ్డి మాత్రమే. మిగిలిన నలుగురిలో సాత్విక్, చిరాగ్ మరో వారంలో ఆ క్యాంప్నకి హాజరుకానున్నట్లు వార్తలు వస్తుండగా.. అశ్విని బెంగళూరులో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్.. హైదరాబాద్లోని గోపీచంద్ అకాడమీకి కొద్ది దూరంలో ఉన్న బ్యాడ్మింటన్ కోర్టులో గత కొన్ని రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
నేషనల్ క్యాంప్నకి ఆటగాళ్ల ఎంపికపై పారదర్శకతని ప్రశ్నిస్తూ.. ఇటీవల సాయ్తో పాటు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)లకి కూడా పారుపల్లి కశ్యప్ లేఖ రాశాడు. కానీ.. ఈ రెండు అసోషియేషనల్ల నుంచి అతనికి సంతృప్తికర సమాధానం లభించినట్లు లేదు. దాంతో.. సైనా నెహ్వాల్ కూడా సాయ్, బాయ్ల తీరుపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వచ్చే ఏడాదికి వాయిదాపడిన విషయం తెలిసిందే.