యాప్నగరం

సింధు, సైనా ఫెయిల్యూర్స్‌కి కారణమిదే..!

పీవీ సింధు, సైనా నెహ్వాల్ గత ఐదారు నెలలుగా వరుసగా విఫలమవుతుండటానికి బిజీ షెడ్యూల్స్ కూడా ఒక కారణమని చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వెల్లడించారు. ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌ జరగనున్నాయి.

Samayam Telugu 21 Feb 2020, 8:58 pm
భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఇటీవల వరుసగా విఫలమవుతుండటానికి బిజీ షెడ్యూల్స్ కారణమని చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డారు. పీవీ సింధు గత ఏడాది వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ గెలిచిన తర్వాత కనీసం ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. సైనా నెహ్వాల్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఆమె గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోతోంది.
Samayam Telugu Basel: Indias Saina Nehwal returns a shuttlecock to Denmarks Mia Blichfeldt du...


టోక్యో ఒలింపిక్స్ మరో ఐదు నెలల్లో ప్రారంభంకానుండగా.. ఈ భారత స్టార్ షట్లర్లు ఫామ్ కోల్పోవడంపై చీఫ్ కోచ్ గోపీచంద్ పెదవి విప్పారు. ‘అవును నిజమే.. పీవీ సింధు, సైనా నెహ్వాల్ తడబడుతున్నారు. ఈ ఇద్దరికీ గత కొన్ని నెలలుగా ఆశించిన విజయాలేమీ దక్కలేదు. బహుశా.. వారి బిజీ షెడ్యూల్స్ కూడా ఈ వైఫల్యాలకి కారణం కావొచ్చు. అందుకే.. మే, జూన్ నెలలో వారికి విశ్రాంతినివ్వడం ద్వారా మానసికంగా ఒలింపిక్స్‌కి సిద్ధం చేయాలనుకుంటున్నాం. వెంట వెంటనే టోర్నీలు ఆడటం చాలా కష్టం’ అని గోపీచంద్ వెల్లడించారు.

రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన పీవీ సింధు.. గత ఏడాది వరకూ సూపర్ ఫామ్‌లో కనిపించింది. ముఖ్యంగా.. వరల్డ్ ఛాంపియన్‌‌షిప్ గెలిచిన తర్వాత ఆమెపై అంచనాలు మరింత పెరిగాయి. కానీ.. ఆ టోర్నీ తర్వాత ఈ అగ్రశ్రేణి షట్లర్ వరుస టోర్నీల్లో పరాజయాన్ని చవిచూస్తోంది. ఇంకా ఆందోళన పెంచే విషయం ఏంటంటే..? కొన్ని టోర్నీల్లో సింధు ఫస్ట్ రౌండ్‌లోనే వెనుదిరుగుతోంది. ఈ నేపథ్యంలో.. టోక్యో ఒలింపిక్స్‌ ముంగిట సింధు మళ్లీ లయ అందుకోవాలని అంతా ఆశిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.