యాప్నగరం

కెబిఎఫ్సి సహయజమానులుగా చిరు, నాగ్

కేరళ బ్లాస్టర్స్ ఫుట్ బాల్ క్లబ్ సహ యజమానులుగా తెలుగు సినీ తారలు చిరంజీవి, అక్కినేని నాగార్జున, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో చేతులు కలిపారు

TNN 1 Jun 2016, 9:28 pm
ఇండియన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ కేరళ బ్లాస్టర్స్ ఫుట్ బాల్ క్లబ్ సహ యజమానులుగా తెలుగు సినీ తారలు చిరంజీవి, అక్కినేని నాగార్జున, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో చేతులు కలిపారు. కేరళ బ్లాస్టర్స్ క్లబ్ ను సచిన్ స్థాపించారు. చిరంజీవి, నాగార్జునతో పాటు సినీ నిర్మాత అల్లు అరవింద్, పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కూడా సహ యజమానులుగా చేరారు. వీరు కేరళ బ్లాస్టర్స్ ఫుట్ బాల్ క్లబ్ యాజమాన్య సంస్థ బ్లాస్టర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన వాటాలను కొనుగోలుచేసారు. సచిన్ తో కలిసి పనిచేయడానికి తాము ఆతృతగా ఎదురుచూస్తున్నామని నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా, చిరంజీవి కూడా తాను కేరళ బ్లాస్టర్స్ క్లబ్ సహ యజమాని కావడం పట్ల ఆనందం వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీతారలతో కలిసి సచిన్ తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకుని ఆశీస్సులు కోరిన సంగతి తెలిసిందే.
Samayam Telugu tollywood actors joins sachin as co owners of kbfc
కెబిఎఫ్సి సహయజమానులుగా చిరు, నాగ్


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.