యాప్నగరం

ఆసియా గేమ్స్‌లో సత్తాచాటుతాం: పీవీ సింధు

ఇండోనేషియా వేదికగా ఈ నెల 18 నుంచి ప్రారంభంకానున్న ఆసియా గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ టీమ్ సత్తా చాటుతుందని స్టార్ షట్లర్

Samayam Telugu 8 Aug 2018, 5:47 pm
ఇండోనేషియా వేదికగా ఈ నెల 18 నుంచి ప్రారంభంకానున్న ఆసియా గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ టీమ్ సత్తా చాటుతుందని స్టార్ షట్లర్ పీవీ సింధు ధీమా వ్యక్తం చేసింది. చైనా వేదికగా ఇటీవల ముగిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఓడిన పీవీ సింధు రజత పతకానికే పరిమితమైన విషయం తెలిసిందే.
Samayam Telugu sindhu-korea-header-1505645122_1100x513


2014లో జరిగిన ఆసియా గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ టీమ్‌ కాంస్య పతకం గెలుపొందగా.. ఈ ఏడాది మరింత మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో షట్లర్లు ఉన్నారు. పీవీ సింధు టీమ్ ఈవెంట్‌తో పాటు సింగిల్స్‌లోనూ పోటీపడనుంది.

‘ఆసియా గేమ్స్‌‌లో మెరుగైన ప్రదర్శన చేస్తాం. ఈసారి టీమ్ ఈవెంట్స్‌తో పాటు వ్యక్తిగత విభాగంలోనూ పోటీపడుతున్నాం. ఈ టోర్నీకి సిద్ధమయ్యేందుకు మాకు చాలా తక్కువ సమయం దొరికింది. అయినప్పటికీ.. శ్రమించి గత టోర్నీ కంటే ఎక్కువ పతకాలు గెలిచేందుకు ప్రయత్నిస్తాం. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలవడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని పీవీ సింధు వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.