యాప్నగరం

బాక్సింగ్ రింగ్‌లో భారత్, చైనా యుద్ధం!

డొక్లాం ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారత బాక్సర్ విజేందర్ సింగ్, చైనాకు చెందిన జుల్పికర్‌తో బాక్సింగ్ పోరులో తలపడనున్నాడు.

TNN 4 Aug 2017, 11:33 am
భారత్, చైనా మధ్య డోక్లాం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. డోక్లాం నుంచి భారత బలగాలు వెనక్కి మళ్లాలని డ్రాగన్ పదే పదే హెచ్చరిస్తుండటం.. మన ఆర్మీ ఏ మాత్రం లక్ష్య పెట్టకపోవడంతో.. ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం లేదు. ఓ దశలో ఇరు దేశాల మధ్య పరిమిత యుద్ధం జరిగే అవకాశం ఉందేమో అనిపించింది. చిన్న వివాదం కోసం రెండు పెద్ద దేశాలు బలప్రదర్శనకు దిగకపోవచ్చు. కానీ బాక్సింగ్ రింగ్‌లో మాత్రం భారత్, చైనా తలపడనున్నాయి. అర్థం కాలేదా..?
Samayam Telugu vijender singh is ready for bout against chinas maimaitiali
బాక్సింగ్ రింగ్‌లో భారత్, చైనా యుద్ధం!


ప్రొఫెషనల్ బాక్సర్‌గా తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న విజేందర్ సింగ్, చైనాకు చెందిన జుల్పికర్ మైమైతియాలితో బాక్సింగ్ రింగ్‌లో తలపడనున్నాడు. ముంబైలో శనివారం వీరిద్దరి మధ్య బాక్సింగ్ పోటీ జరగనుంది. ప్రొఫెషల్ బాక్సర్‌గా 8 సార్లు తలపడిన విజేందర్ ఓటమి అనేది లేకుండా ముందుకు సాగుతున్నాడు.

శనివారం జరగనున్న మ్యాచ్‌‌లో చైనా బాక్సర్‌ను మట్టికరిపించాలని విజేందర్ తహతహలాడుతున్నాడు. చైనా వస్తువులు మన్నిక తక్కువ. అవి ఎక్కువ కాలం మన్నలేవంటూ.. తనతో పోటీలో చైనా బాక్సర్ ఎక్కువసేపు నిలువలేడంటూ పరోక్షంగా జుల్పికర్‌కు చురకలు అంటించాడు. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు సచిన్ టెండుల్కర్ లాంటి దిగ్గజాలను ఆహ్వానించాడు.

మరోవైపు 2014లో ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన జుల్పికర్ కూడా డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్ మిడిల్ వెయిట్ ఛాంపియన్ అయిన విజేందర్‌తో అమీతుమీకి సిద్ధపడుతున్నాడు. విజేందర్‌పై గెలిచేందుకు శక్తి మేర ప్రయత్నిస్తానని చెప్పాడు. భారత్, చైనా మధ్య డోక్లాం వివాదం గురించి మీ అభిప్రాయం ఏంటని అడగ్గా.. స్పందించేందుకు నిరాకరించాడు. రాజకీయాలు, క్రీడలకు సంబంధం లేదని బదులిచ్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.